Chandrababu Naidu : కొడాలి నానిపై చంద్ర‌బాబు సెటైర్

గుడివాడ‌కు ఎమ్మెల్యే అంటూ ఉన్నారా

Chandrababu Naidu : టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు జోష్ పెంచారు. ఆయ‌న రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం జ‌గ‌న్ రెడ్డిని, వైసీపీని టార్గెట్ చేశారు. ఆయ‌న రాష్ట్రంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రో వైపు త‌న‌యుడు నారా లోకేష్ యువ గ‌ళం పేరుతో పాద‌యాత్రకు శ్రీ‌కారం చుట్టారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం వెల్లివిరిసింది.

ఇదిలా ఉండ‌గా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. అస‌లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అంటూ ఉన్నాడా అని ఎద్దేవా చేశారు. వైసీపీ తుడుచుకు పెట్టుకు పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. జిల్లాలో 3 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గుడివాడ‌లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నాయుడు అధికారాన్ని టార్గెట్ చేశారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. కోట్లాది రూపాయ‌ల అప్పులు చేయ‌డం త‌ప్ప ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. కొడాలి నానికి రాజకీయంగా భిక్ష పెట్టామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. చ‌రిత్ర హీనులుగా మార‌డం ఖాయ‌మ‌న్నారు. బూతులు మాట్లాడే స్థాయికి త‌మ పార్టీ దిగ‌జ‌రాద‌ని పేర్కొన్నాడు. పులివెందుల‌లో టీడీపీ జెండా ఎగుర వేయ‌డంతో దిమ్మ తిరిగింద‌న్నారు టీడీపీ చీఫ్‌.

Also Read : ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్ – ఎండీ

Leave A Reply

Your Email Id will not be published!