Nara Lokesh : రాజ‌ధాని అయ్యాకే ఇల్లు క‌ట్టుకుంటాం

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

Nara Lokesh : టీడీపీ అగ్ర నేత నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువ గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా సోమ‌వారం ప్ర‌సంగించారు. అమ‌రావ‌తిలో భూములు కోల్పోయిన రైతుల‌తో ఆయ‌న ముఖా ముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ‌కు ఇల్లు లేద‌ని వైసీపీ ఆరోపిస్తోంద‌ని దానికి త‌మ వ‌ద్ద క్లియ‌ర్ గా స‌మాధానం ఉంద‌ని పేర్కొన్నారు నారా లోకేష్(Nara Lokesh).

Nara Lokesh Comments About Amaravati

ప్ర‌జా రాజ‌ధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల‌కు న్యాయం చేశాక‌, రాజ‌ధాని ఏర్ప‌డిన త‌ర్వాత‌నే నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలోనే ఇల్లు క‌ట్టుకుంటార‌ని , ఆ మేర‌కు శ‌ప‌థం కూడా చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అమ‌రావ‌తిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ప్ర‌స్తుత స‌ర్కార్ త‌న‌పై కూడా ఆరోప‌ణ‌లు చేసింద‌ని కానీ సెంటు భూమి కూడా త‌న‌కు లేద‌న్నారు. అలా ఉంటే నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు.

నిరాధార ఆరోప‌ణ‌లు చేసినంత మాత్రాన అమ‌రావ‌తి రైతులు న‌మ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా త‌న‌పై చేసిన విమ‌ర్శ‌లకు ఆధారాలు చూపించ లేక పోయార‌ని ఎద్దేవా చేశారు. బ‌ట్ట కాల్చి ఇత‌రుల మీద వేయ‌డం వైసీపీ నేత‌ల‌కు, మంత్రుల‌కు, సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఒక అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు నారా లోకేష్.

రాబోయే రోజులలో జ‌నం బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. తెలుగుదేశం పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పారు.

Also Read : TTD EO : న‌డ‌క దారిలో మూడు చిరుత‌ల గుర్తింపు – ఈవో

Leave A Reply

Your Email Id will not be published!