NEET 2024: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్ !

నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్ !

NEET 2024: నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పీడ్ పెంచింది. నీట్ పేపర్ లీకేజీకు సంబంధించి రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ అనే మరో నిందితుడిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. బిహార్‌ లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతను నీట్(NEET) పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపినట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది.

NEET 2024 Update

ఈ నేపథ్యంలో రాకీని పట్టుకునేందుకు పట్నా, కోల్‌కతా సమీపంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. అతని భార్య ఇమెయిల్ ID ఐపీ అడ్రస్ ద్వారా రాకీని పట్టుకోగలిగారు. అరెస్టు అనంతరం కోర్టులో రాకీని హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం సీబీఐ అతనికి10 రోజుల రిమాండ్‌ను మంజూరు చేసింది. అతను ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాదు బిహార్‌ రాష్ట్రం మలందాకు చెందిన మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియాతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఇద్దరు అనుమానితులైన సన్నీ, రంజిత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. సన్నీ విద్యార్థి కాగా, రంజిత్ ఓ విద్యార్థి తండ్రి. వీరిని ఆరు రోజుల రిమాండ్‌కు తరలించారు. వారిని విచారిస్తుండగానే రాకీ గురించి తెలిసింది.

హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ నుంచి పేపర్‌ లీక్‌ జరిగిందని విచారణలో తేలింది. సంజీవ్ ముఖియా పరీక్ష పత్రాలను అందుకున్నాడు. వాటిని ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చింటూ మొబైల్‌ కు ఫార్వార్డ్ చేశాడు. చింటూ, రాకీ.. పట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌లో ప్రశ్నలు, సమాధానాలను విద్యార్థులకు షేర్ చేసినట్లు సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

Also Read : Minister Sridhar Babu : బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదులిచ్చిన ఐటీ మినిస్టర్

Leave A Reply

Your Email Id will not be published!