Newly Wed Woman: నవవధువు ఆశలు ఆవిరి చేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
నవవధువు ఆశలు ఆవిరి చేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
Newly Wed Woman : అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో మంది కలల్ని చిదిమేసింది. నిండు నూరేళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఆశ పడిన ఓ నవ వధువు ఈ ప్రమాదంలో చనిపోయింది. లండన్ లో ఉన్న తన భర్తను తొలిసారి కలిసేందుకు వెళ్లిన ఆమె జాడ తెలియక తన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజస్థాన్లోని (Rajasthan) బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామనాకి చెందిన ఖుష్బూ రాజ్పురోహిత్ కు… ఇటీవల మన్ఫూల్ సింగ్తో వివాహం జరిగింది. ఆమె భర్త లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహం తర్వాత… భర్తను కలవడానికి తొలిసారి లండన్ ఆమె ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆమె మరణించి ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Newly Wed Woman – గుడ్ బై ఇండియా అన్నారు… కానీ ఏకంగా ?
భారత్ లో యోగా కార్యక్రమాల నిమిత్తం బ్రిటన్ కు చెందిన ఇద్దరు యువకులు ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొన్ని రోజుల పాటు అహ్మదాబాద్లోని (Ahmedabad) ద హౌస్ ఆఫ్ ఎంజీలో బస చేశారు. ఇక ఇక్కడ ప్రోగ్రామ్లు పూర్తి కావడంతో భారత్ గురించి, అహ్మదాబాద్(Ahmedabad) లోని తాను బస చేసిన హోటల్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా బ్రిటన్లో ఉన్న భార్యకు షేర్ చేశాడు. అహ్మదాబాద్లోని ద హౌస్ ఆఫ్ ఎంజీపై ప్రశంసలు కురిపించారు. నిజంగానే ఒక హెరిటేజ్ హోటల్ అని, భారత్లోని తన అనుభవాలు అద్భుతమని ఇలా ఒక్కో స్టోరీని పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి(బుధవారం, జూన్ 11) ఇదే ఇక్కడ చివరి రాత్రి అంటూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
గురువారం లండన్ కు విమానం బయలుదేరే సమయంలో కూడా వారు ఇన్స్టాగ్రామ్లో ఎమోషన్ పోస్టు పెట్టారు. ‘‘భారత్ (India) పర్యటన ఎంతో బాగుంది. ఇక్కడ ఉన్నంత కాలం ఎన్నో సరదా క్షణాలు గడిపాం. మరికొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉంది. ఇక్కడ ఇదే మనకు చివరి రాత్రి. దీనితో పాటు విమానం ఎక్కేముందు ‘గుడ్ బై ఇండియా’ అని బ్రిటన్కు చెందిన జమీ మీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాసేపటికి ఆయన విమానం ప్రమాదంలో మృతి చెందడం జరిగిపోయాయి. ప్రమాదం తర్వాత వీరి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మన దేశంపై ఎంతో ఇష్టం పెంచుకున్నారు. ఈ ప్రమాదం జరగడం ఎంతో బాధేస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రాణాలు కాపాడిన ప్రయాణ వాయిదా
‘అదృష్టం…దురదృష్టం… అంతా విధి ఆడే వింత నాటకమే’ అంటున్నారు గుజరాత్కు చెందిన 60 ఏళ్ల సవ్జీభాయ్ టింబడియా. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్ లో గురువారం ప్రమాదానికి గురైన విమానం ఎక్కాల్సి ఉంది. లండన్ లో నివసిస్తున్న ఆయన కుమారుడు ఇటీవల సవ్జీభాయ్ టింబడియా కోసం విమాన టికెట్ బుక్ చేశారు. విమానయాన సంస్థ సీటు నంబరు కూడా కేటాయించింది. అయితే, నాలుగు రోజుల క్రితమే సవ్జీభాయ్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ‘ఆ నిర్ణయం నా ప్రాణాలను కాపాడుతుందని అప్పుడు తెలియదు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే లండన్ నుంచి నా కుమారుడు ఫోన్ చేశాడు. మీరు(తండ్రి) చేసిన సత్కార్యాలే ప్రాణాలు కాపాడాయని అన్నాడు’ అని సవ్జీభాయ్ తెలిపారు.
Also Read : Doctor Family: లండన్ లో సెటిల్ అవుదామని బయలుదేరి బూడిదైన డాక్టర్ కుటుంబం