Mahua Moitra : అస‌భ్య ప‌దం వాడ‌లేదు – మ‌హూవా

పార్ల‌మెంట్ లో రాద్దాంతం పై క్లారిటీ

Mahua Moitra : ప్ర‌జా దేవాల‌యంగా అభివ‌ర్ణించిన పార్ల‌మెంట్ ఇవాళ దూష‌ణ‌ల‌కు, విద్వేషాల‌కు, వాయిదాల‌కు కేరాఫ్ గా మారాయి. దేశాన్ని కుదిపి వేస్తున్న అదానీ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

పెద్ద ఎత్తున విప‌క్షాలు మండిప‌డ్డాయి. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదం తెలిపే తీర్మానం సంద‌ర్భంగా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌హూవా మోయిత్రా(Mahua Moitra) చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

అస‌భ్య ప‌ద‌జాలం వాడారంటూ బీజేపీకి చెందిన ఎంపీలు మండిప‌డ్డారు. ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ఒక మ‌హిళ‌గా మాట్లాడాల్సిన మాట‌లు కాదంటూ మండిప‌డ్డారు. వెంట‌నే స్పీక‌ర్ ఓం బిర్లా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించాల‌ని కోరారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై బీజేపీ ఎంపీ, ప్ర‌ముఖ న‌టి హేమ మాలిని తీవ్రంగా స్పందించారు. లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీ ఇలా దిగ‌జారి మాట్లాడ‌టం మంచిది కాద‌న్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు మ‌హూవా మోయిత్రా. తాను అన్న‌దాంట్లో త‌ప్పేమీ లేద‌న్నారు.

బీజేపీ ఎంపీలు కావాల‌ని త‌న‌ను బద్నాం చేసేందుకు చేస్తున్న కుట్రగా ఆమె అభివ‌ర్ణించారు. పార్ల‌మెంట్ లో విప‌రీత‌మైన ప‌ద‌జాలాన్ని తాను ఉప‌యోగించ లేద‌న్నారు మ‌హూవా మోయిత్రా. త‌న‌కు కూడా ఏది ఎప్పుడు ఏ ప‌దం వాడాలో బాగా తెలుస‌న్నారు ఎంపీ. బీజేపీ నాయ‌కుల‌తో చెప్పించుకునేంత దీన స్థితిలో తాను లేన‌ని పేర్కొన్నారు మ‌హూవా మోయిత్రా(Mahua Moitra).

బీజేపీకి చెందిన మంత్రులు రైతుల ఉద్య‌మ స‌మ‌యంలో దారుణ‌మైన ప‌దాలాను వాడారు. అవి రికార్డు లో కూడా ఉన్నాయ‌ని అవి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

Also Read : మౌనం వీడ‌ని మోదీ బాబా – ఖ‌ర్గే

Hemamalini Mahua Moitra : మ‌హూవాపై హేమమాలిని ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!