Om Prakash Rajbhar : అఖిలేష్ యాద‌వ్ పై రాజ్ భ‌ర్ గుస్సా

ఏసీ రూముల్లో కూర్చుంటే గెలుస్తామా

Om Prakash Rajbhar : స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ పై దాడుల ప‌రంప‌ర మొద‌లైంది. మిత్ర‌ప‌క్షంగా ఉన్న సుహేల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్ర‌కాష్ రాజ్ భ‌ర్(Om Prakash Rajbhar) అఖిలేష్ యాద‌వ్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

యూపీలోని రాంపూర్ , అజంగ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గాలకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కైవ‌సం చేసుకుంది. గ‌త కొన్నేళ్లుగా ఈ రెండు స్థానాల్లో స‌మాజ్ వాది పార్టీకి కంచుకోట‌గా ఉన్నాయి.

కానీ ఈసారి సీన్ మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల‌న, వ్యూహాల ముందు ఏవీ ప‌ని చేయ‌లేక పోయాయి. ఒక‌రు 12 వేల ఓట్లు మ‌రొక‌రు 42 వేల ఓట్ల తేడాతో ఓడి పోయారు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాది పార్టీతో ఎస్పీఎస్పీ , ఇత‌ర పార్టీలు క‌లిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. ఈ సంద‌ర్భంగా రాజ్ భ‌ర్ బుధ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

అఖిలేష్ యాద‌వ్ ఏనాడైనా సొంతంగా గెలిచారా అని ప్ర‌శ్నించారు. ఏసీ గ‌దుల్లో కూర్చుంటే ఎలా గెలువ‌గ‌ల‌మ‌ని అనుకుంటున్నారంటూ నిల‌దీశారు.

2012లో అఖిలేష్ యాద‌వ్ త‌న తండ్రి ములాయం సింగ్ యాద‌వ్ వ‌ల్లే గెలిచార‌ని పేర్కొన్నారు. 2017 , 2014, 2019 ల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎలాంటి ఆశించిన ఫ‌లితాలు రాలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాజ్ భ‌ర్.

తాజాగా రాంపూర్ , అజంగ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఓట‌మిపై స్పందిస్తూ ఈ ఎన్నిక‌ల్లో కూడా అఖిలేష్ యాద‌వ్ ఓడి పోయాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : టైల‌ర్ కిల్ల‌ర్స్ కు పాక్ తో లింకులు

Leave A Reply

Your Email Id will not be published!