Parushuram : మ‌హేష్ బాబు కోస‌మే క‌థ రాసుకున్నా

వేరే ఎవ‌రితో తీసే వాడిని కాదు

Parushuram : గీత గోవిందంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చిన ప‌రుశురామ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ తో తీసిన స‌ర్కార్ వారి పాట ఈనెల‌లో విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లో ప్రీ ఈవెంట్ జ‌రిగింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కులు సుకుమార్ , వంశీ పైడిప‌ల్లి, బుచ్చిబాబు, గోపిచంద్ మ‌లినేని ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(Parushuram) మాట్లాడుతూ ఈ క‌థ‌ను కేవ‌లం మ‌హేష్ బాబును దృష్టిలో పెట్టుకుని క‌థ రాసుకున్నాన‌ని చెప్పారు. మ‌హేష్ బాబు గ‌నుక ఓకే చెప్ప‌క పోయి ఉండ‌క పోతే ఇంకే ఏ హీరోతోనూ తీసి ఉండేవాడిని కాద‌న్నారు.

 

మ‌న‌సు పెట్టి చేశా. మ‌హేష్ బాబు డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్. ఆయ‌నతో ప‌ని చేస్తున్న‌ట్టే ఉండ‌దు. అంత రిలాక్స్ డ్ గా ఉంటారు. పెద‌వుల‌పై ఆ చిరున‌వ్వు అలాగే ఉంటుంద‌న్నారు.

కేవ‌లం ప్రిన్స్ మ‌హేష్ బాబు కోసం ప్ర‌త్యేకంగా కేరెక్ట‌ర్ ను , డైలాగుల‌ను , కొత్త పాత్ర‌ల‌ను త‌యారు చేశాన‌ని చెప్పారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా సినిమా పూర్తి అయ్యేందుకు ఆలస్యం అయ్యింద‌న్నారు(Parushuram).

ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది రామ్ లక్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఫైటింగ్స్ , అనంత్ శ్రీ‌రామ్ పాట‌లు, ఎస్ఎస్ థ‌మ‌న్ అద్భుతంగా పాట‌లు అందించాడు. ఇప్పుడు అవి యూట్యూబ్ , సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు ద‌ర్శ‌కుడు.

నా కోసం ఎన్నో డేట్స్ వ‌దులుకున్నారు మ‌హేష్ బాబు. ఈ క్రెడిట్ అంతా వారికే ద‌క్కుతుంద‌న్నారు.

 

Also Read : సినిమా చూశాక క‌ళావ‌తిగా గుర్తిస్తారు

Leave A Reply

Your Email Id will not be published!