Narendra Modi : ప్రధాని మోదీకి తన కొడుకు అఖిరాను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్

అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ గురించి ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అఖిర...

Narendra Modi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబ సమేతంగా ఈరోజు (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా పవన్ మోదీకి తన కుమారుడు అఖిర నందన్‌ను పరిచయం చేశారు. అకిర భవిష్యత్తుకు సంబంధించి ప్రధాని మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో విజయం సాధించింది. పవన్ సక్సెస్ పట్ల మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక స్థానం ఉంది.

Narendra Modi Meet

అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ గురించి ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అఖిర. దీనికి సంబంధించిన వీడియోను అఖిరా తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఎన్డీయే సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న పార్టీల నేతలు మోదీని మూడోసారి ఏకగ్రీవంగా ఎన్డీయే చీఫ్‌గా ఎన్నుకున్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో మోదీ, ఆయన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరా నందన్‌కి త్వరలో సినిమా అరంగేట్రం చేయబోతున్నాడు.

Also Read : BJP : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మార్చనున్న పార్టీ అధినేతలు

Leave A Reply

Your Email Id will not be published!