Pawan Kalyan : తెగించే వ‌చ్చా తాట తీస్తా – ప‌వ‌న్ కళ్యాణ్

మ‌రోసారి వైసీపీ నేత‌ల‌పై షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan : ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నా ఆయా పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అంటూ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారం స్టార్ట్ చేశారు.

మ‌రో వైపు జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఆయ‌న ప్ర‌ధానంగా వైసీపీని, సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలోని ఇప్ప‌టం బాధితుల‌ను ఆదివారం సంద‌ర్శించారు.ఇప్పటం గ్రామ ఇళ్ళు కూల్చివేత బాధితులకు దాదాపు 39 కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan).

మీరు బెదిరిస్తే తాను బెదిరేటోడిని కాద‌న్నారు. తాను ఏమీ చేత‌కాని కాడిన‌ని అన్నారు. అధికార పార్టీని ఏకి పారేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేశారు. ఎవ‌రైనా కొన్ని సార్లు సంద‌ర్భానుసారం న‌వ్వుతార‌ని కానీ సీఎం ఎల్లప్పుడూ న‌వ్వుతూనే ఉంటార‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌తి దానికీ త‌న‌పై కేంద్రంలో జ‌గ‌న్ , ఆయ‌న అనుయాయులు త‌న‌పై ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఆరోపించారు.

గుర్రం జాషువా పేరుతో విద్యా ప‌థ‌కాన్ని ఎందుకు పెట్ట‌లేద‌న్నారు. పింగ‌ళి వెంక‌య్య పేరుతో క్యాంటీన్ పేర్లు ఎందుకు పెట్టేలేద‌ని ప్ర‌శ్నించారు. క‌న్నెగంటి హ‌న్మంతు పేరు ఎందుకు పెట్ట‌లేద‌ని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్ర‌తి ప‌థ‌కానికి వైఎస్ పేరు ఎందుకు పెట్టారంటూ మండిప‌డ్డారు. అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డాగా మారింద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మైన‌వ‌ని పేర్కొన్నారు.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త

Leave A Reply

Your Email Id will not be published!