Asaduddin Owaisi : చిరుత‌ను మించి పోయిన మోదీ – ఓవైసీ

జ్ఞాన వాపి తీర్పు బాధాక‌రం..వ్య‌తిరేకం

Asaduddin Owaisi : దేశంలో ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేదు. ప్ర‌ధానంగా ఒక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌న్నారు ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ.

వార‌ణాసి కోర్టు జ్ఞాన వాపి మ‌సీదు కేసులో హిందువుల‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డాన్ని తప్పు ప‌ట్టారు. దీనిని తాము ఒప్పుకోబోమ‌న్నారు. హైకోర్టుకు , సుప్రీంకోర్టులో స‌వాల్ చేస్తామ‌ని చెప్పారు ఓవైసీ(Asaduddin Owaisi).

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న చిరుత కంటే వేగంగా క‌దులుతున్నార‌ని, ఇత‌రుల‌కు మేలు చేసే కంటే ఇత‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముందంజ‌లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

ఇది పొగ‌డ్త మాత్రం కాద‌న్నారు ఓవైసీ. రెండు రోజుల రాజ‌స్థాన్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

వార‌ణాసి తీర్పు పూర్తిగా ప్రార్థ‌నా స్థలాల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని ఆరోపించారు. ఒక ర‌కంగా ఆయ‌న ఆవేద‌న చెందారు. తయితే తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌ను త‌ప్పించుకునే విష‌యంలో చిరుత కంటే వేగంగా ఉంటార‌ని మోదీని ఉద్దేశించి అన్నారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలోని మ‌ద‌ర్సాల‌పై స‌ర్వే నిర్వహించాల‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ యోగి ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ను ఆయ‌న విమ‌ర్శించారు.

ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం విష‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇప్ప‌టి దాకా నోరు ఎందుకు విప్ప‌డం లేద‌ని నిల‌దీశారు అస‌దుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi).

స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డంలో ప్ర‌ధాని మోదీని మించిన నాయ‌కుడు ఈ దేశంలో లేర‌న్నారు ఓవైసీ.

Also Read : కావాల‌నే బీజేపీ రెచ్చ‌గొట్టింది – సీఎం దీదీ

Leave A Reply

Your Email Id will not be published!