PM Modi Road Show : ఘ‌న స్వాగ‌తం మోదీపై పూల‌వ‌ర్షం

శివ‌మొగ్గ‌లో ఎయిర్ పోర్ట్ ప్రారంభం

PM Modi Karnataka Road Show  : క‌న్న‌డ నాట రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్ప‌టికే కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని అనుకుంటోంది. కోట్లాది రూపాయ‌ల నిధులు మంజూరు చేస్తోంది కేంద్రం. ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. అనంత‌రం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా క‌ర్ణాట‌క‌లో పాల్గొన్నారు. ఎలాగైనా స‌రే ఇక్క‌డ రెండోసారి డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ రావాల‌ని కోరుకుంటోంది బీజేపీ.

సోమ‌వారం క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. అంత‌కు ముందు బీజేపీ అగ్ర నాయ‌కుడు, నాలుగు సార్లు సీఎంగా ప‌ని చేసిన బీఎస్ యెడియూర‌ప్ప పుట్టిన రోజు పుర‌స్క‌రించుకు శివ‌మొగ్గ‌లో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు పీఎం. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రోడ్ షో(PM Modi Karnataka Road Show) నిర్వ‌హించారు. భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ఘ‌నంగా స్వాగతం ప‌లికారు. పెద్ద ఎత్తున పూల వ‌ర్షం కురిపించారు. త‌మ ప్రేమ‌ను చాటుకున్నారు జ‌నం.

అంత‌కు ముందు రాష్ట్రానికి సంబంధించి రూ. 16,8000 కోట్ల కంటే విలువైన పీఎం కిసాన్ 13వ విడ‌త‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ , మే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోడ్ షో సంద‌ర్భంగా ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రంగు రంగుల పూల‌ను న‌రేంద్ర మోదీపై కురిపించారు. దాదాపు 10.5 కిలోమీట‌ర్ల మేర రోడ్ షో చేప‌ట్ట‌డం విశేషం. మోదీ మోదీ అంటూ ఆ ప్రాంతం మారుమ్రోగింది.

Also Read : పేద‌లు సైతం విమానాల్లో తిర‌గాలి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!