PM Modi Visit : జూన్ 18న వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

వారణాసిలో ప్రధాని ఒక్క బటన్‌పై ఒక్క క్లిక్‌తో మొత్తం 9.26 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు చేరుతుందని చెప్పారు...

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత కింద 20,000 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేయనున్నారు. అనంతరం 30 వేల స్వయం సహాయక సంఘాలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

PM Modi Will Visit

జూన్ 10న, మూడవసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ(PM Modi), 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే 17వ విడత పిఎం కిసాన్ నిధి కింద రూ.20,000 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 6,000 నేరుగా రైతుల ఆధార్-ప్రారంభించబడిన బ్యాంకు ఖాతాలలో జమ చేయబడుతుంది. ఒక్కోసారికి రూ.2000 చొప్పున మూడు విడతలుగా ఈ మొత్తాన్ని జమ చేస్తారు.

దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది రైతులను ఈ కార్యక్రమంలో చేర్చుకుంటామని, 17వ విడతలో రూ.2,000 కోట్లు విడుదల చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వారణాసిలో ప్రధాని ఒక్క బటన్‌పై ఒక్క క్లిక్‌తో మొత్తం 9.26 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు చేరుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకు పైగా ప్రాథమిక రైతు సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

Also Read : Kaleswaram Commission : కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం నిర్మాణం జరిగిందంటున్న కమిటీ

Leave A Reply

Your Email Id will not be published!