PM Narendra Modi : ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని

మీరట్‌ను లక్నోతో కలిపే తొలి వందే భారత్ రైలు ఇది...

PM Narendra Modi : ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ చర్యల్లో భాగంగా కొత్త రైళ్లతో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకరమవుతుందని పేర్కొంది. ‘ మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా వందే భారత్ రైళ్లను తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టారు. సౌకర్యవంతమైన ప్రయాణం, వేగవంతమైన ప్రయాణం కోసం తీసుకువచ్చిన వచ్చిన ఈ రైళ్లు ప్రస్తుతం 100కు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతూ ప్రయాణం సాగిస్తున్నాయి.

PM Narendra Modi Starts..

-మీరట్ సిటీ-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : మీరట్‌ను లక్నోతో కలిపే తొలి వందే భారత్ రైలు ఇది. పర్యాటకాన్ని పెంచేందుకు, రాష్ట్ర రాజధానితో వేగవంతమైన అనుసంధానం వల్ల స్థానిక పరిశ్రమలకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

-మదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: మదురై టెంపుల్ సిటీని బెంగళూరు కాస్మో పాటిటలన్ హబ్‌ను కలుపుతుంది. దీంతో వాణిజ్యం, విద్య, తమిళనాడు-కర్ణాటక మధ్య ఉద్యోగుల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుంది.

-చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ఈ ప్రాంతంలో తొలి వందే భారత్ సర్వీస్ ఇది. తమిళనాడులోని 726 కిలోమీటర్లను కలుపుతూ 12 జిల్లాల మీదుగా వెళ్తుంది. యాత్రికులు, స్థానికులకు మెరుగైన ట్రావెల్ సదుపాయాన్ని అందిస్తుంది. కాగా, ఈ వందే భారత్ రైళ్లలో కవచ్ టెక్నాలజీ, రొటేటింగ్ చైర్స్, ఫ్రెండ్లీ టాయిలెట్స్, ఇంటిగ్రేటెడ్ బ్రయిలె సిగ్నేజెస్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కల్పించారు.

Also Read : KTR Comment : కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో విద్యా రంగాన్ని కుదేలు చేసింది

Leave A Reply

Your Email Id will not be published!