#PrashanthKishore : అరుదైన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్

పీకే డిసైడ్ అయితే వార్ ఒన్ సైడే

Prashanth Kishore : భార‌తీయ రాజ‌కీయాల‌లో ఆయ‌న చురుకైన వ్యూహ‌క‌ర్త‌. ఆయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంచ‌ల‌న‌మే. నిశ్శ‌బ్ధంగా ప‌ని చేసుకుంటూ పోతారు. త‌న‌కంటూ బ‌ల‌మైన బృందం ఉంది. వి.వి.వినాయ‌క్ తీసిన ఠాగూర్ లో చిరంజీవి ఏర్పాటు చేసుకున్న టీం లాంటిదే ఏర్ప‌ర్చుకున్నారు. త‌ను డిసైడ్ అయితే వార్ ఒన్ సైడే అన్నది జ‌గ‌మెరిగిన స‌త్యం.

అత‌డెవ‌రో కాదు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా పేరొందిన బీహార్ కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్(Prashanth Kishore). ఆయ‌న ఇపుడు ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌ను ఎంచుకున్నారు. రెండూ కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తిప‌క్ష పార్టీలే. ఒక‌టి అధికారంలో ఉంటే ఇంకొక‌టి ప్ర‌తిప‌క్షంలో ఉంది. ప్ర‌శాంత్ కిషోర్ ను అంద‌రూ ప్రేమ‌గా పీకే అని పిలుచుకుంటారు.

బెంగాల్ లో తృణ‌మూల్ కాంగ్రెస్ ప‌వ‌ర్ లో ఉంటే త‌మిళ‌నాడులో డిఎంకే స్టాలిన్ విప‌క్ష నేత‌గా ఉన్నారు. పీకే టార్గెట్ అంతా ఈ రెండు రాష్ట్రాల మీద ఉంది. మ‌రో వైపు మోదీ, అమిత్ షా ద్వ‌యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల‌ని నానా తంటాలు ప‌డుతోంది బెంగాల్ లో. తాజాగా ఏబీపీ స‌ర్వేలో బెంగాల్ లో మ‌మ‌తనే ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని, త‌మిళ‌నాట డిఎంకే అల‌య‌న్స్ పార్టీలు అధికారంలోకి వ‌స్తాయ‌ని తేల్చింది.

ప్ర‌శాంత్ కిషోర్(Prashanth Kishore) అవ‌లంభించే విధానాలు భిన్నంగా ఉంటాయి. అవి ఎవ‌రికీ అర్థం కావు. తాను ఏర్పాటు చేసిన ఇండియన్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ టీం (ఐపాక్ ) స‌భ్యులంతా అప‌ర మేధావులు. ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో మెరిక‌ల్లాంటి కుర్రాళ్ల‌ను ఎంపిక చేసుకున్నాడు. రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డంలో పీకే దిట్ట‌.

దిశా నిర్దేశం చేయ‌డంలో ప‌వ‌ర్ ఫుల్ స్ట్రాట‌జిస్ట్. ఇండియ‌న్ పాలిటిక్స్ లోకి రాక ముందు ప్ర‌శాంత్ కిషోర్ ఐదేళ్ల పాటు ఐక్య‌రాజ్య స‌మితిలో ప‌ని చేశాడు. ఆయ‌న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో మోదీ గెలిచేందుకు మొద‌టి సారిగా వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేశాడు 2012లో . అప్పుడే పీకే ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించాడు.

2013లో సిటిజెన్స్ ఫ‌ర్ అకౌంట‌బుల్ గ‌వ‌ర్నెన్స్ ను స్థాపించాడు. 2014 ఎన్నిక‌ల కంటే ముందు ఏర్ప‌ర్చిన మీడియా సంస్‌థ‌. మోడీ చాయ్ పే చ‌ర్చా, 3 డి ర్యాలీలు, ర‌న్ ఫ‌ర్ యూనిటీ, మంథ‌న్ సోష‌ల్ మీడియా ప్రోగ్రామ్ ల వినూత్న మార్కెటింగ్, ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌చారాన్ని రూపొందించిన ఘ‌న‌త ప్ర‌శాంత్ కిషోర్(Prashanth Kishore) దే. మోడీతో వీడాక ఐపాక్ ఏర్పాటు చేశాడు.

2017లో ఏపీలో వైఎస్ జ‌గ‌న్ కిషోర్(Prashanth Kishore) ను రాజ‌కీయ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. స‌మ‌ర శంఖారావం, అన్న పిలుపు, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర , రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ లాంటి వ్యూహాల‌ను పీకే ప‌న్నాడు. దీంత 2019లో 151 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించింది. 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌ని చేశాడు. అక్క‌డ విజ‌యం సాధించేందుకు దోహద ప‌డ్డాడు. మొత్తం మీద ప్ర‌శాంత్ కిషోర్ మామూలోడు కాదు.

No comment allowed please