Priyanka Chopra Jonas : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా , నిక్ జోనాస్ దంపతులు ఇవాళ సంచలన ప్రకటన చేశారు. తనకంటే చిన్న వాడైన నిక్ జోనాస్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము ఈ కొత్త సంవత్సరం అభిమానులకు ఖుష్ కబర్ చెబుతున్నట్లు తెలిపారు. అదేమిటంటే సరగోసీ ద్వారా పండంటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రియాంక చోప్రాతో పాటు భర్త నిక్ జోనాస్ (Priyanka Chopra Jonas)ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు పోస్ట్ చేయడంతో అధికారికంగా ధ్రువీకరించారు కూడా.
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ లో నటిస్తూ వస్తోంది ప్రియాంక చోప్రా. అంతే కాకుండా అమెరికాలోని కొన్ని చానల్స్ లో వ్యాఖ్యాతగా, హోస్ట్ గా కూడా ఉన్నారు.
మరో వైపు రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా మారారు. భారతీయ రుచులను పరిచయం చేస్తూ ఈ రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం అది ఫుల్ ఫ్రాఫిట్ తో నడుస్తోంది.
ఇదిలా ఉండగా తాము సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని ధ్రువీకరించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రత్యేక సమయంలో మీ అందరి ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్(Priyanka Chopra Jonas) దంపతులు.
ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో 2017లో కలుసుకున్నారు. ఆమె నటి అతడు గాయకుడు కావడం విశేషం.
Also Read : భావోద్వేగాల సమ్మేళనం ‘గెహ్రైయాన్’