Producer SKN: పిఠాపురంలో జనసేన అభిమానికి ఆటో రిక్షా ఇచ్చిన నిర్మాత ఎస్కేయన్‌ !

పిఠాపురంలో జనసేన అభిమానికి ఆటో రిక్షా ఇచ్చిన నిర్మాత ఎస్కేయన్‌ !

Producer SKN: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని అయిన మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని నిర్మాత ఎస్కేయన్‌ గతంలో ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ కుటుంబానికి ఆయన ఆటో కొనిచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… ఆ కుటుంబానికి ఆటో బహుమతిగా ఇచ్చిన ఫోటోలను షేర్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Producer SKN Given

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాయి. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులు పెట్టి, ఊరంతా పార్టీ ఇచ్చేస్తానని మరియమ్మ అనే మహిళ అన్న వీడియో అప్పట్లో వైరల్‌ అయింది. ఆ వీడియోను అప్పట్లో జనసేన పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయగా, నిర్మాత ఎస్కేయన్‌(Producer SKN) స్పందించారు.

‘కళ్యాణ్‌గారు గెలిచిన తర్వాత ఆటో రిక్షా కొని వీడియోలో ఉన్న మహిళ భర్తకు గిఫ్ట్‌ ఇస్తా. నా హీరో, అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి’ రిప్లై ఇచ్చారు. అప్పట్లో ఆయన అన్నట్లుగానే గురువారం మరియమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుగా ఇచ్చారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నాకెంతో ఇష్టమైన నాయకుడి పట్ల మరియమ్మ కుటుంబం చూపిన ప్రేమకు గుర్తుగా ఆటో కొనిచ్చా. వాళ్ల మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. వాళ్ల కళ్లలో ఆనందం చూసి, ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రియతమ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌గారికి మరింత శక్తినివ్వాలి. ఆయన గర్వపడేలా అభిమానులు, అనుచరులు నడుచుకోవాలి’’ అని ఎక్స్‌ వేదికగా మరియమ్మ కుటుంబంతో దిగిన ఫొటోలను షేర్ చేసారు.

Also Read : IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు !

Leave A Reply

Your Email Id will not be published!