Bhagwant Mann : మరిన్ని పోస్టులకు ‘మాన్’ గ్రీన్ సిగ్నల్
పంజాబ్ లో త్వరలో మరిన్ని జాబ్స్
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఏళ్ల కొద్దీ పని చేస్తున్న వారికి శుభవార్త చెప్పారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారందరికీ నియామక పత్రాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సోమవారం మరో శుభవార్త చెప్పారు నిరుద్యోగులకు. పంజాబ్ రాష్ట్ర ఏజీ కార్యాలయంలో ఎస్సీ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా 58 అదనపు పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann).
రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకతతో నిర్వహిస్తామని, ఎలాంటి అపోహలకు గురి కావద్దంటూ స్పష్టం చేశారు. ఎవరి సిఫారసులను తాము పరిగణలోకి తీసుకోమని హెచ్చరించారు.
ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినా లేదా ప్రలోభాలకు గురి చేసినా వెంటనే తన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి చదువు కోవాలని , పరీక్షకు ప్రిపేర్ కావాలని భగవంత్ మాన్ కోరారు.
తాను అవినీతి, అక్రమాలను సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిభ కలిగి, కష్టపడే వారికి తాము ప్రయారిటీ ఇస్తామని, వారే విజేతలుగా నిలుస్తారని , విజయానికి ఎలాంటి దగ్గరి దారులంటూ ఉండవని మరోసారి స్పష్టం చేశారు పంజాబ్ సీఎం(Bhagwant Mann).
త్వరలోనే జాబ్స్ భర్తీకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని వెల్లడించారు సీఎం. ఇక నుంచి దశల వారీగా జాబ్స్ ను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : నన్ను చంపినా సరే పోరాటం ఆపను
आज एक और खुशखबरी मैं आपके साथ साझा कर रहा हूं।
हमने पंजाब के AG कार्यालय में SC समुदाय के लिए 58 अतिरिक्त पद जारी किए हैं। भर्ती पूरी पारदर्शिता के साथ और बिना सिफारिश के की जाएगी।
हमारी सरकार पंक्ति में खड़े आखिरी व्यक्ति तक सुविधा और सम्मान पहुंचाने के लिए काम कर रही है। pic.twitter.com/zyTsedBxex
— Bhagwant Mann (@BhagwantMann) August 21, 2022