Raghunandan Rao : లీకులు స‌రే అరెస్ట్ లు ఎక్క‌డ‌ – బీజేపీ

ర‌ఘునంద‌న్ రావు ఫోటోలు, వీడియో రిలీజ్

Raghunandan Rao : అమ్నీషియా ప‌బ్ రేప్ కేసు రోజు రోజుకు ఉత్కంఠ‌ను రేపుతోంది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. మైన‌ర్ బాలిక‌పై ఐదుగురు అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

కాగా కేసులో ప్ర‌ముఖుల పిల్ల‌లు ఉన్నార‌ని వారిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao) ఆరోపించారు.

పోలీసుల తీరు హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఫోటోలు, వీడియో త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని , కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ఎందుకు నిందితుల‌ను అరెస్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

మైన‌ర్ బాలిక అత్యాచార కేసులో పోలీసులు లీకులు ఇస్తున్నారే త‌ప్పా అరెస్టులు ఎందుకు చేయ‌లేద‌ని డీజీపిని, ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. శ‌నివారం ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao) మీడియాతో మాట్లాడారు.

ఈ కేసు పూర్తి కాకుండానే పోలీసులు తీర్పు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. బాధితుల త‌ర‌పున మాట్లాడిన వారిపై కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇస్తున్నారు. త‌మ‌ను కాదు. త‌ప్పుల్ని చేసిన వారిని ముందు అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

అస‌లు నిందితులు ఎవ‌రో ఎందుకు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేద‌న్నారు. సామూహిక ఘ‌ట‌న‌లో నిందితుల ఫోటోల‌ను ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచార‌ని ప్ర‌శ్నించారు ర‌ఘునంద‌న్ రావు.

ఫోటోలు, వీడియోలు మా వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పారు. రెడ్ క‌ల‌ర్ కారులో ఉంది ముమ్మాటికీ ఎమ్మెల్యే కొడుకేనంటూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

బాధితుల‌కు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు తాము పోరాడుతామ‌ని చెప్పారు ఎమ్మెల్యే. సీబీఐతో లేదా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read : త్వ‌ర‌లో మున్సిప‌ల్ శాఖ‌లో పోస్టుల భ‌ర్తీ

Leave A Reply

Your Email Id will not be published!