Ram Dev Baba : ఓవైసీపై రాం దేవ్ బాబా కామెంట్స్

గాయత్రి మంత్రం ప్ర‌భావంతో జెండా ఎగ‌ర‌వేత‌

Ram Dev Baba :  ప్ర‌ముఖ యోగా గురు రాం దేవ్ బాబా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేశారు.

గ‌తంలో ప్ర‌తి దాని గురించి దేశానికి సంబంధించి రివ‌ర్స్ లో మాట్లాడే వార‌ని , కానీ ఇప్పుడు గాయత్రి మంత్రం ప్ర‌భావంతో ఓవైసీ కూడా జాతీయ జెండాను ఎగుర వేశారంటూ ఎద్దేవ చేశారు.

ప్ర‌స్తుతం రాం దేవ్ బాబా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

హ‌ర్ ఘ‌ర్ తిరంగా అన్న‌ది ఒక్క రోజుతో ముగిసే కార్య‌క్ర‌మం కాద‌న్నారు. ఇది నిరంత‌రం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. జాతీయ జెండా అంటే ప‌తాకం ఒక్క‌టే కాద‌ని అది దేశ ఆత్మ గౌర‌వానికి, స‌మ‌గ్ర‌త‌కు, ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు రాం దేవ్ బాబా(Ram Dev Baba).

యావ‌త్ ప్ర‌పంచం త్రివ‌ర్ణ శోభితంతో నిండి పోయింద‌ని ప్ర‌శంసించారు. జాతీయ జెండాల‌ను ఎగుర వేయ‌డం వ‌ల్ల జాతి బ‌లం ఏమిటో ఈ ప్ర‌పంచానికి మ‌రోసారి చాటి చెప్పామ‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన హ‌ర్ ఘ‌ర్ తిరంగా ఇవాళ చ‌రిత్ర సృష్టించింన్నారు రాం దేవ్ బాబా. అంతే కాదు జాతీయ జెండాల‌ను ఎగుర వేస్తూ దిగిన సెల్ఫీల‌తో రికార్డు నెలకొల్ప‌డం దేశానికి ఉన్న శ‌క్తి ఏమిటో తెలియ చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు యోగా గురు రాం దేవ్ బాబా.

చిన్నారులు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు, వృద్దులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు కుల‌, మ‌తాల‌కు అతీతంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగాలో పాల్గొన‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు.

Also Read : ఆంగ్ సాన్ సూకీకి మ‌రో ఆరేళ్ల జైలు శిక్ష

Leave A Reply

Your Email Id will not be published!