Revanth Reddy Team : ప‌ద‌వుల‌కు వ‌ల‌స నేత‌లు గుడ్ బై

పార్టీలో రాజీనామాల క‌ల‌క‌లం

Revanth Reddy Team : కాంగ్రెస్ పార్టీలో నిన్న సీనియ‌ర్ల‌కు కౌంట‌ర్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన వారంతా త‌మకు అప్ప‌గించిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టీడీపీ నుంచి పార్టీలో చేరిన 13 మందిలో వేం న‌రేంద‌ర్ రెడ్డి,

ఎమ్మెల్యే సీత‌క్క‌, విజ‌య ర‌మ‌ణా రావు, దొమ్మాటి సాంబ‌య్య‌, వ‌జ్రేష్ యాద‌వ్ , చార‌గొండ వెంక‌టేశ్ , స‌త్తు మ‌ల్లేష్ , శ‌శిక‌ళ యాద‌వ్ రెడ్డి, చిలుక మ‌ధుసూద‌న్ రెడ్డి, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు.

వీరంతా త‌మ రాజీనామా లేఖ‌ల‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ కు పంపించారు. ఇవాళ గాంధీ భ‌వ‌న్ లో కీల‌క స‌మావేశం జ‌రిగింది. త‌మ ప‌ద‌వుల‌కు గుడ్ బై చెప్పిన నాయ‌కులంతా మావేశానికి హాజ‌రు కావ‌డం విశేషం. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సార‌థ్యంలో హాత్ సే హాత్ జోడో స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ మీటింగ్ కు నిన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రూ హాజ‌రు కాలేదు. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గా రెడ్డి, మ‌ధు యాష్కి గౌడ్ , దామోద‌ర్ రాజ న‌ర్సింహ్మ‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఏఐసీసీ స‌మావేశానికి సీనియ‌ర్లు వ‌స్తార‌ని భావించినా వారు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఈ కీల‌క స‌మావేశానికి మాజీ మంత్రులు ష‌బ్బీర్ అలీ, సుద‌ర్శ‌న్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్ర‌భాక‌ర్ , అంజ‌న్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. సీనియ‌ర్ నాయ‌కులు అద్దంకి ద‌యాక‌ర్ ,మ‌హిళా నేత‌లు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థకం

Leave A Reply

Your Email Id will not be published!