RS Praveen Kumar : దొర‌ల రాజ్యం బ‌హుజ‌నుల‌కు శాపం

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : తెలంగాణ‌లో దొర‌ల పాల‌న సాగుతోంద‌ని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) ఆరోపించారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. సీఎం కేసీఆర్, మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అగ్ర‌వ‌ర్ణ దొర‌ల దాష్టీకాల‌కు ఎంద‌రో బ‌హుజ‌నులు బ‌లై పోతున్నార‌ని ఆరోపించారు. అక్ర‌మ కేసుల‌లో ఇరికించి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

RS Praveen Kumar Comments Viral

జాన‌య్య యాద‌వ్ లాంటి బ‌హుజ‌న బిడ్డ‌ల‌పై కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు ఆలోచించాల‌ని స్ప‌ష్టం చేశారు. పేద‌లు, బ‌హుజ‌నులు ఈ విష‌యంలో ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు. కేసీఆర్ దొర పాల‌న‌లో మ‌న‌కొక న్యాయం, వాళ్ల‌కొక న్యాయం అన్న‌ది మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన వారికి ఉచితంగా, ఎలాంటి పైర‌వీలు లేకుండా ఉన్న‌త స్థాయిల‌లో పోస్టింగ్ లు , మ‌న‌కేమో ఈస‌డింపులు, అవ‌మానాలు , పోస్టింగుల‌కు ప‌ది ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

బ‌హుజ‌నులు చిన్న తప్పు చేస్తే వీఆర్ లు, లూప్ లైన్లు , ఛార్జి మెమోలు, స‌స్పెన్ష‌న్లు , డిమోష‌న్లు , వాళ్ల‌కేమో దొడ్డి దారిన ఆక్సిల‌రేటెడ్ ప్ర‌మోష‌న్స్ , సేవా పత‌కాలు , విదేశీ టూర్లకు ఎంపిక చేస్తున్నారంటూ ఆరోపించారు. పోస్టింగ్ ల్లో వాళ్ల‌కేమో మాదాపూర్ లో మ‌న‌కేమో మాద‌న్న‌పేట‌లో అని ఎద్దేవా చేశారు బీఎస్పీ చీఫ్‌.

Also Read : CPI Narayana : మేం క‌లిస్తే కేసీఆర్ కు డిపాజిట్లు రావు

Leave A Reply

Your Email Id will not be published!