Donald Trumps Visit : 36 గంట‌ల ప‌ర్య‌ట‌న రూ. 38 ల‌క్ష‌ల ఖ‌ర్చు

అమెరికా మాజీ చీఫ్ ట్రంప్ ఇండియా టూర్

Donald Trumps Visit : అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trumps Visit) అధికారంలో ఉన్న స‌మ‌యంలో భార‌త్ లో ప‌ర్య‌టించారు. 2020న ఆయ‌న ఇండియాకు వ‌చ్చారు. కేవ‌లం 36 గంట‌లు మాత్ర‌మే ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద స‌ద‌రు ట్రంప్ కోసం భార‌త ప్ర‌భుత్వం ఏ మేర‌కు , ఎంత ఖ‌ర్చు చేసింద‌నే దానిపై ఒక‌రు వివ‌రాలు కోరారు.

ఇందుకు సంబంధించి ఆర్టీఐ స‌మాచారం వెల్లడించింది. కేవ‌లం కొన్ని గంట‌ల కోసం ప్ర‌భుత్వం రూ. 38 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింద‌ని తెలిపింది. ట్రంప్ దేశ అధ్య‌క్షుడి హోదాలో ఇండియాలో ప‌ర్య‌టించారు.

డొనాల్డ్ ట్రంప్ తో పాటు భార్య మెలానియా, కుమార్తె ఇవాంక‌, అల్లుడు జారెడ్ కుష్న‌ర్ , ప‌లువురు ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి 2020 ఫ‌బ్ర‌వ‌రి 24, 25 తేదీల‌లో ప‌ర్య‌టించారు.

ఈ టూర్ సంద‌ర్భంగా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ట్రంప్ ఫ్యామిలీ భార‌త్ లోని అహ్మ‌దాబాద్ , ఆగ్రా, న్యూఢిల్లీల‌ను సంద‌ర్శించారు.

వీరికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల కోసం గాను రూ. 38,00,000 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపింది ఆర్టీఐ. ఈ డ‌బ్బుల‌ను వ‌స‌తి, భోజ‌నం, లాజిస్టిక్స్ , ఇత‌ర వాటి కోసం ఖ‌ర్చు చేసిన‌ట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర స‌మాచార క‌మిష‌న్ కు స్ప‌ష్టం చేసింది.

24న అహ్మదాబాద్ లో మూడు గంట‌లు గ‌డిపారు ట్రంప్. 22 కిలోమీట‌ర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో గాంధీకి నివాళులు అర్పించారు.

మోదీతో క‌లిసి నమస్తే ట్రంప్ స‌మావేశంలో ప్ర‌సంగించారు. 25న దేశ రాజ‌ధానిని సంద‌ర్శించారు. ప్ర‌ధానితో భేటీ అయ్యారు.

Also Read : ‘అమృత్ కాల్’ పైనే మోదీ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!