Samatha Kumbh 2023 : దివ్య సాకేతం క‌ళ్యాణ మ‌హోత్స‌వం

ఘ‌నంగా సాకేత్ కుంభ్ -2023 ఉత్స‌వం

Samatha Kumbh 2023 : శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మతా కుంభ్ 2023 ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారే కాకుండా దేశ‌, విదేశాల నుంచి కూడా భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. శంషాబాద్ లోని ముచ్చింత‌ల్ లో కొలువైన దివ్య సాకేతం ఇప్పుడు జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ అనే నామం మారుమ్రోగుతోంది.

ఫిబ్ర‌వ‌రి 2 గురువారం రోజు ప్రారంభ‌మ‌య్యాయి స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు(Samatha Kumbh 2023). ప్ర‌తి రోజూ పూజ‌లు కొన‌సాగుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. చిన్నజీయ‌ర్ స్వామి వారి కృప కోసం, ఆయ‌న అంద‌జేసే తీర్థ ప్ర‌సాదం కోసం భ‌క్తులు వేచి చూస్తున్నారు. ఈనెల 14 వ‌ర‌కు ఉత్స‌వాలు కొన‌సాగుతాయి.

స‌మ‌తా కుంభ్ లో భాగంగా శ‌నివారం ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల దాకా సామూహిక పారాయ‌ణం. 1.30 నుంచి 4.00 గంట‌ల దాకా ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా వికాస త‌రంగిణి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. సాయంత్రం 6.00 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శేష వాహ‌న సేవ‌, హంస వాహ‌న సేవ‌, 18 గ‌రుడ సేవ‌లు కొన‌సాగాయి. అనంత‌రం తీర్థ‌, ప్ర‌సాదం అంద‌జేశారు.

5న ఆదివారం 108 రూపాల‌లో శాంతి క‌ళ్యాణ మ‌హోత్స‌వం ప్ర‌ధాన వేదిక‌పై ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామీజి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్ణు స‌హ‌స్ర నామ జ‌పం విశిష్ట‌త గురించి కూడా తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

Also Read : భ‌క్త‌జ‌నం గంగ‌లో పుణ్య స్నానం

Leave A Reply

Your Email Id will not be published!