Sanjay Raut : శివ‌సేనను క‌దిలిస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టం

స్ప‌ష్టం చేసిన ఎంపీ సంజ‌య్ రౌత్

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌రాఠా సంక్షోభం నేప‌థ్యంలో శ‌నివారం సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఆధ్వ‌ర్యంలో కీల‌క భేటీ కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. శివ‌సేన‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌లేర‌న్నారు. దానిని క‌దిలిస్తే లేదా క‌దిలించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే త‌ట్టుకోవ‌డం క‌స్టమ‌ని హెచ్చ‌రించారు.

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కు మాత్ర‌మే తెలివి తేట‌లు ఉంటే ఇత‌రుల‌కు ఉండ‌వా అని ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్. కేంద్రం ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ఆట‌లు సాగ‌వ‌న్నారు. రెబ‌ల్స్ గౌహ‌తిలో ఉంటే ఎలా ముందు ఇక్క‌డికి వ‌స్తే ఏంటో తేలుతుంద‌న్నారు.

శివ‌సేన చాలా పెద్ద‌ద‌ని దానిని ఎవ‌రూ స్వాధీనం చేసుకోలేర‌న్నారు. ఎన్నో త్యాగాల కార‌ణంగా పార్టీ నిర్మాణం జ‌రిగింద‌న్నారు.

ఒక‌రు లేదా ఇద్ద‌రు తిరుగుబాటు చేసినంత మాత్రాన కొన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వ‌స్తున్న శివ‌సేన పార్టీని ధ్వంసం చేయాల‌ని అనుకోవ‌డం ఓ భ్ర‌మ అని కొట్టి పారేశారు.

మ‌రాఠాలో కాలు మోపితే తెలుస్తుంది పార్టీ స‌త్తా ఏమిటోన‌ని అన్నారు సంజ‌య్ రౌత్. ప్ర‌స్తుతం శివ‌సేన సైనికులు ఇళ్ల‌ల్లో ఉన్నార‌ని వాళ్లు గ‌నుక బ‌య‌ట‌కు వ‌స్తే అగ్గి రాజు కోవ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇంకోసారి ఆలోచించు కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మ‌రాఠా భ‌గ్గుమంటోంది.

తిరుగుబాటు ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసుల‌పై దాడులు మొద‌ల‌య్యాయి. తాజాగా తానాజీ సావంత్ పై దాడికి పాల్ప‌డ్డారు.

Also Read : ఫ‌డ్న‌వీస్ వ‌ల్లే మ‌రాఠా సంక్షోభం – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!