Sanjay Raut : మ‌రాఠాలో మ‌ళ్లీ మాదే అధికారం

బీజేపీని చిత్తు చేస్తామ‌న్న రౌత్

Sanjay Raut  : శివ‌సేన ఎంపీ, జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ (Sanjay Raut )సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీని టార్గెట్ చేశారు. మ‌రాఠాలో మ‌హా వికాస్ అగాధీ ప్ర‌భుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

బీజేపీ చీఫ్‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చేసిన కామెంట్స్ పై క‌న్నెర్ర చేశారు. మ‌హారాష్ట్రంలో బీజేపీ ప‌ని ఖ‌తమై పోయంద‌న్నారు. రాబోయే 2024లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామ‌ని, మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

తాజా రాజకీయాల‌పై ఆయ‌న స్పందించారు. బీజేపీ చౌక‌బారు రాజ‌కీయాలు చేస్తోందంటూ మండిప‌డ్డారు. అయితే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దించ‌డం లేదంటే ఇబ్బందుల‌కు గురి చేయ‌డం త‌ప్ప ఈ దేశం కోసం చేయాల్సిన ప‌నులేవీ చేయ‌డం లేద‌న్నారు.

మోదీ జిమ్మిక్కులు, బీజేపీ మ్యాజిక్కులు, అమిత్ షా ట్రిక్కులు శివ‌సేన వ‌ద్ద ప‌ని చేయ‌వ‌న్నారు. తాము తల్చుకుంటే బీజేపీని మ‌రాఠాలో లేకుండా చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఉద్ద‌వ్ స‌ర్కార్ కొలువు తీరి రెండున్న‌ర ఏళ్లు అవుతోంద‌ని మ‌రో రెండున్న‌ర ఏళ్లు ఇలాగే పాలిస్తామ‌ని చెప్పారు సంజ‌య్ రౌత్(Sanjay Raut ).

ఎన్నిక‌లు అన్న‌వి వాళ్ల‌కు రాజ‌కీయ క్రీడ‌గా చూస్తార‌ని కానీ తమ‌కు ప్ర‌జా బ‌లం ఉంద‌న్న‌ది వాళ్లు తెలుసు కోలేక పోతున్నార‌ని ఆరోపించారు.

రాజ‌కీయ పార్టీలు గోవాను అర్థం చేసుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాయ‌ని పేర్కొన్నారు సంజ‌య్ రౌత్. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగించ‌డం త‌ప్ప కేంద్రానికి ఏమీ చేత కాదంటూ ఎద్దేవా చేశారు.

Also Read : చ‌రిత్ర సృష్టించిన చౌహాన్

Leave A Reply

Your Email Id will not be published!