Tushar Gandhi : గాడ్సేకు తుపాకి ఇచ్చింది సావ‌ర్క‌రే

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన తుషార్ గాంధీ

Tushar Gandhi : జాతిపిత మ‌హాత్మా గాంధీ ముని మ‌నుమ‌డు తుషార్ గాంధీ(Tushar Gandhi) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. బాపును చంపిన నాథురామ్ గాడ్సేకు స‌హాయం చేశాడంటూ ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్దాంత‌క‌ర్త సావ‌ర్క‌ర్ ను దేశ ద్రోహి అంటూ మండిప‌డ్డారు.

తుషార్ గాంధీ గాంధీ హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితులు, గాడ్సేకు ఎవ‌రు తుపాకి అంద‌జేసార‌నే దానిపై అధికారిక ట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావించారు. జాతిపిత మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీని చంపేందుకు నాథూరామ్ గాడ్సేకు వీర సావ‌ర్క‌ర్ తుపాకీని అంద‌జేశారంటూ మండిప‌డ్డారు.

తాను ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం లేద‌ని, కానీ చ‌రిత్ర‌లో న‌మోదైన విష‌యాన్ని చెబుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు తుషార్ గాంధీ. వినాయక్ దామోద‌ర్ సావ‌ర్క‌ర్ గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఈ కామెంట్స్ చేయ‌డం మ‌రింత రాద్దాంతం చోటు చేసుకునేలా చేసింది.

కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన శివ‌సేన రాహుల్ చేసిన కామెంట్స్ ను త‌ప్పు ప‌ట్టింది. తాము ఒప్పుకోవ‌డం లేద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం తుషార్ గాంధీ ముని మ‌నవ‌డు చేసిన ట్వీట్ పై ఇంకా స్పందించ లేదు శివసేన‌. గాడ్సేకు సావ‌ర్కర్ గ‌న్ అందించార‌న్న‌ది తాను చెప్ప‌డం లేద‌ని ఆనాటి పోలీస్ ఎఫ్ఐఆర్ లో ఉంద‌ని పేర్కొన్నారు.

తాను క‌ల్పించి చెప్ప‌డం లేద‌ని చ‌రిత్ర‌లో ఉన్న‌దే చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు తుషార్ గాంధీ(Tushar Gandhi). సావ‌ర్క‌ర్ బ్రిటీష్ వారికి సాయం చేశాడు. బాపును హ‌త్య చేసేందుకు స‌మ‌ర్థ‌వంత‌మైన తుపాకీని ఇవ్వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడంటూ తుషార్ గాంధీ ఆరోపించారు.

Also Read : రాజ‌కీయం ‘పాద‌యాత్ర‌’ల కాలం

Leave A Reply

Your Email Id will not be published!