MK Stalin : రెజ్లర్లపై ఖాకీల దౌర్జన్యం స్టాలిన్ ఆగ్రహం
మొదటి రోజే మోదీ రాజ దండం వంగింది
MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు సీఎం స్టాలిన్(MK Stalin). నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమైన మొదటి రోజునే మోదీ తాను నమ్మిన , భవనంలోకి తీసుకు వచ్చిన రాజ దండం రెజ్లరపై దాడితో వంగి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలపై ప్రేమ లేని వాళ్లు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఈ దేశంలో బీజేపీ కొలువు తీరాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు ఎంకే స్టాలిన్.
మహిళా రెజ్లర్లు తమ అసమాన ప్రతిభతో దేశానికి పేరు తీసుకు వచ్చేలా చేశారన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు కాని వాళ్లు అయి పోయారా అంటూ నిలదీశారు ప్రధాని మోదీని. లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
రాజ దండం అనేద న్యాయాన్ని సమర్థించే పాలనకు ప్రతీకగా చెప్పుకుంటారు. కానీ మోదీ కొలువు తీరాక అంతా అన్యాయం తప్ప న్యాయం ఎక్కుడుందంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తమ న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతూ మహిళా రెజ్లర్లు మహిళా పంచాయత్ చేపట్టారు. చివరకు ఉద్రిక్తంగా మారింది. రెజ్లర్లను, కుటుంబీకుల పట్ల అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించారు ఖాకీలు.
Also Read : Tamil Seers