YS Sharmila : ఐటీ వైఫల్యం పేపర్ లీక్ వ్యవహారం
కేసు నమోదు చేయాలన్ని షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకు వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖనే అంటూ మండిపడ్డారు. పేపర్ లీక్ లో ఐటీ శాఖను చేర్చాలని కోరుతూ వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఇందులో పూర్తిగా బాధ్యత వహించాల్సింది మంత్రి అనిపేర్కొన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం ఒకే ఒక ఐపీ అడ్రస్ , పాస్ వర్డ్ తెలిస్తే పేపర్ లీక్ చేసే ఛాన్స్ అనేది ఉందా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఇందుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరారు.
పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని అన్నారు. తనకు సంబంధం లేని మంత్రి ఎలా ప్రెస్ మీట్ పెడతాడంటూ ప్రశ్నించారు. విద్యా శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సి ఉండగా చివరకు ఆమె మౌనం వహించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఇదే పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఆడిట్స్ బయట పెట్టాలని కోరారు వైఎస్ షర్మిల(YS Sharmila). పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు.
Also Read : ఈటల ప్రయత్నం ఫలించేనా