Sonia Gandhi Represent : రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి సోనియా హాజ‌రు

శ్రీ‌న‌గ‌ర్ లో చిక్కుకున్న కాంగ్రెస్ ఎంపీలు

Sonia Gandhi Represent : పార్ల‌మెంట‌రీ పార్టీ సమావేశం ప్రారంభ‌మైంది. ఉభ‌య స‌భ‌లు లోక్ స‌భ‌, రాజ్య స‌భ ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రసంగించారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ హాజ‌ర‌య్య‌రు. ఇదిలా ఉండ‌గా ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో భార‌త్ జోడో యాత్ర ముగిసింది.

జ‌న‌వ‌రి 31న కాశ్మీర్ లో ముగింపు స‌భ‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని 21 పార్టీలకు ఆహ్వానం ప‌లికింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కాశ్మీర్ లోనే ఇరుక్కు పోయారు. ప్ర‌స్తుతం హిమ‌పాతం భారీగా ఉండ‌డంతో చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఉభ‌య స‌భ‌ల‌కు హాజ‌రు కాలేక పోయారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రిగే ముగింపు కీల‌క బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌త్యేకంగా సోనియా గాంధీ హాజ‌రు కావాల్సి ఉంది. కానీ వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక పోవ‌డంతో ఆమె వెళ్ల‌లేక పోయార‌ని కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ద్రౌప‌ది ముర్ము చేసిన మొద‌టి ప్ర‌సంగానికి సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ(Sonia Gandhi) హాజ‌రైన‌ట్లు తెలిపారు.

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల విమానాలు ఆల‌స్యం కావ‌డంతో శ్రీ‌న‌గ‌ర్ లోనే చిక్కుకు పోయిన‌ట్లు ఆ పార్టీకి చెందిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్ వెల్ల‌డించారు. భారీ మంచు కార‌ణంగా శ్రీ‌న‌గ‌ర్ నుండి అన్ని విమానాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read : ఎల‌క్టోర‌ల్ బాండ్ స్కీంపై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!