Subramanian Swamy : ఓవైసీ కామెంట్స్ స్వామి సీరియ‌స్

కాశీ విశ్వ‌నాథ ఆల‌యం మాదే

Subramanian Swamy : భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ ఎంపీ డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఎవ‌రి డీఎన్ఏ ఏమిటో తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు.

తాను విసిరిన స‌వాల్ కు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేద‌ని ఎద్దేవా చేశారు సుబ్ర‌మ‌ణ్య స్వామి. ద‌మ్ముంటే త‌న ముందుకు రావాల‌ని అన్నారు. పురాత‌న కాలం నుంచీ వార‌ణాసిలో కాశీ విశ్వ‌నాథుని ఆల‌యం కొలువుతీరి ఉంద‌న్నారు.

దానిపై అభ్యంత‌రం చెప్పే హ‌క్కు అసుదుద్దీన్ ఓవైసీకి లేద‌న్నారు. ఆలయాన్ని ముట్టు కోవ‌ద్ద‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఆయ‌న ఈ దేశంలో ఉన్నారా లేక పాకిస్తాన్ లో ఉన్నారా అని సుబ్ర‌మ‌ణ్య స్వామి(Subramanian Swamy) ప్ర‌శ్నించారు.

కాశీ విశ్వ‌నాథుని టెంపుల్ లో పూజ‌లు చేయ‌డం త‌మ‌కు పూర్వం నుంచి సంక్ర‌మించిన వార‌స‌త్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని ఆపే, నిల‌దీసే హ‌క్కు ఎవ్వ‌రికీ లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లోని స‌త్య‌సాయి నిగ‌మాగమంలో ఇస్కాన్ కు చెందిన కౌఇజం యూట్యూబ్ ఛాన‌ల్ ను డాక్ట‌ర్ స్వామి ప్రారంభించారు.

ప్రంచంలో ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉన్న సంస్కృతి ఏదైనా ఉందంటే అది ఒక్క భార‌త దేశంలో మాత్ర‌మే ఉంద‌న్నారు.

దేశంలోని ప్ర‌తి ఆల‌యాన్ని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ఈ దేశంలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సుబ్ర‌మ‌ణ్యం స్వామి(Subramanian Swamy). భార‌తీయ వార‌స‌త్వం, నాగ‌రిక‌త ఆవుతో ముడిప‌డి ఉంద‌న్నారు.

Also Read : రాహుల్ గాంధీపై శ‌శి థ‌రూర్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!