Supriya Shrinate : రాజ్ పోప‌ట్ కు రాజీవ్ ఫౌండేష‌న్ స‌పోర్ట్

స్ప‌ష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ

Supriya Shrinate : ఇటీవ‌లే ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చారు భార‌త దేశానికి చెందిన ఎన్నారై స్టూడెంట్ రిషి రాజ్ పోప‌ట్. గ‌త 2,500 ఏళ్లుగా ప‌రిష్కారం కాని సంస్కృత ప‌జిల్ ను ఆయ‌న ప‌రిష్క‌రించారు. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. అయితే కాంగ్రెస్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

రిషి రాజ్ పోప‌ట్ కు రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ నుంచి గ్రాంట్ ల‌భించింద‌ని తెలిపింది. తాము ఇచ్చిన ఉపకార వేత‌నంతో కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీలో చ‌దువుకుంటున్నాడ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు సంబంధించిన విదేశాల నుంచి నిధులు పొందేందుకు అవ‌స‌ర‌మైన ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ర‌ద్దు చేసింది.

అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు భార‌త దేశంతో యుద్దానికి సై అంటున్న చైనా నుంచి కూడా నిధులు వ‌చ్చాయ‌ని ఆరోపించారు. ఎఫ్సీఆర్ఏకు సంబంధించి ఇంత వ‌ర‌కు ఎక్క‌డి నుంచి నిధులు వ‌చ్చాయ‌నే దానిపై వివ‌రాలు స‌మ‌ర్పించ లేద‌ని పేర్కొన్నారు.

అందుకే లెసెన్స్ ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిపై బీజేపీ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తంది. రిషి రాజ్ పోప‌ట్ కు రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ నుండి మాత్ర‌మే గ్రాంట్ ల‌భించింద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు సుప్రియా శ్రీ‌నాట్(Supriya Shrinate) తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Also Read : శ‌క్తి వంత‌మైన యుద్ద నౌక మోర్ముగావో

Leave A Reply

Your Email Id will not be published!