KTR Amit Shah : అమిత్ షాకు కేటీఆర్ బ‌హిరంగ లేఖ

తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పండి

KTR Amit Shah : బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. శ‌నివారం కేంద్ర హోం శాఖ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా(Amit Shah) రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు షాపై.

తెలంగాణ‌కు కేంద్రం ఏం చేసిందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేయ‌డం త‌ప్పా ఒక్క మంచి ప‌ని చేసిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు.

27 ప్ర‌శ్న‌ల‌తో కూడిన లేఖ‌ను అమిత్ షాకు సంధించారు. తాను లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర మంత్రి స‌మాధానం చెప్పాలంటూ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.

గ‌డిచిన ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని నిధులు మంజూరు చేసిందో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌న్నారు.

ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ‌లో కులం, మ‌తం, ప్రాంతం, వ‌ర్గం పేరుతో విభేదాల‌ను బీజేపీ సృష్టిస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తెలంగాణ‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన మోదీ స‌ర్కార్ తెలంగాణ ప‌ట్ల పూర్తిగా వివ‌క్ష చూపుతోందంటూ ఆరోపించారు కేటీఆర్(KTR).

గుజ‌రాత్ కు మాత్రం దండిగా నిధులు మంజూరు చేశారంటూ మండిప‌డ్డారు. తెలంగాణ‌పై ఏ మాత్రం చిత్త‌శుద్ది ఉన్నా బ‌హిరంగ స‌భ‌లో స‌మాధానం చెప్పాల‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండ‌గా మంత్రి కేటిఆర్ లేవ‌దీసిన 27 ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కానీ మంత్రి అమిత్ షా కానీ స్పందించ లేదు.

 

Also Read : ఏసీబీకి చిక్కిన అవినీతి చేప‌

Leave A Reply

Your Email Id will not be published!