Rivaba Jadeja : ర‌వీంద్ర జ‌డేజా భార్య‌కు టికెట్ ఛాన్స్

పున‌రాలోచ‌న‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ

Rivaba Jadeja : గుజ‌రాత్ లో ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇది మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అటు గుజ‌రాత్ ఇటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఎన్నిక‌లను సెమీ ఫైన‌ల్ గా చూస్తోంది బీజేపీ. ఇప్ప‌టికే దేశంలో కొలువుతీరిన బీజేపీయేత‌ర ఎనిమిది రాష్ట్రాల‌ను కూల్చ‌డంలో స‌క్సెస్ అయ్యింది.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ చేతిలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కేర‌ళ‌లో సీపీఎం, బీహార్ లో జేడీయూ, తెలంగాణ‌లో టీఆర్ఎస్, త‌మిళ‌నాడులో డీఎంకే, జార్ఖండ్ లో జేఎంఎం, ఒడిశాలో బిజూ జ‌న‌తాదళ్ ,ఢిల్లీ, పంజాబ్ ల‌లో ఆప్ కొన‌సాగుతున్నాయి.

ఈ త‌రుణంలో ఎవ‌రికి టికెట్లు ఇవ్వాల‌నే దానిపై జేపీ న‌డ్డా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు ఢిల్లీలో. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ క్రికెట‌ర్ ర‌వీంద్ర జడేజా భార్య కు(Rivaba Jadeja) టికెట్ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. మాజీ సీఎం విజ‌య్ రూపానీ వంటి సీనియ‌ర్ల‌కు టికెట్లు ఇవ్వ‌క పోవ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా మెకానిక‌ల్ ఇంజ‌నీర్ అయిన రివాబా జ‌డేజా(Rivaba Jadeja) 2016లో క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల కింద‌ట బీజేపీలో చేరారు రివాబా. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ల‌భించే ఛాన్స్ ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 27 ఏళ్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

ఈసారి కాంగ్రెస్, ఆప్, బీజేపీ మ‌ధ్య త్రిముఖ పోరు కొన‌సాగనుంది. మొత్తంగా ఈ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారాయి.

Also Read : ఇంగ్లండ్ భార‌త్ మ్యాచ్ పై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!