TMC Releases 1st List : టీఎంసీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల

52 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రారు

TMC Releases 1st List : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) శుక్ర‌వారం మేఘాల‌య ఎన్నిక‌ల కోసం మొద‌టి జాబితాను ప్ర‌క‌టించింది. పార్టీ అగ్ర నాయ‌కుడు జార్జ్ బి లిగ్డో ఉమ్రోయ్ నుంచి పోటీ చేయ‌నున్నారు. రాష్ట్ర టీఎంసీ చీఫ్ చార్లెస్ పింగ్రోప్ నోం్లిమ్మాయి నుంచి చేయ‌నుండ‌గా మాజీ సీఎం ముకుల్ సంగ్మా తిక్రికిలా (ఎస్టీ) స్థానం నుంచి, సాంగ్సాక్ (ఎస్టీ) స్థానాల నుంచి బ‌రిలో ఉండ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌రో రెండు నెల‌ల్లో మేఘాల‌యలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు చార్లెస్ పింగ్రోప్ , తృణ‌మూల్ కాంగ్రెస్ శాస‌నస‌భ పార్టీ నాయ‌కుడు ముకుల్ సంగ్మా 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 52 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన జాబితాలో 15 మంది ఎమ్మెల్యేలు, ఎండీసీలు ఉన్నార‌ని వెల్ల‌డించారు పార్టీ చీఫ్ , మాజీ సీఎం. మొత్తం ప్ర‌క‌టించిన వారిలో ఐదుగురు మ‌హిళ‌ల‌కు పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు చెప్పారు చార్లెస్ పింగ్రోస్ . ఇక మిగిలి పోయిన ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల పేర్ల‌ను(TMC Releases 1st List) రాబోయే రోజుల్లో ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు టీఎంసీ చీఫ్‌.

పార్టీకి చెందిన సీనియర్ స‌భ్యులు, సెలెక్ష‌న్ క‌మిటీలో కూలంకుషంగా చ‌ర్చించిన త‌ర్వాతే పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం ముకుల్ సంగ్మా మీడియాతో మాట్లాడారు. మేఘాల‌య సుర‌క్షితంగా ఉండాలంటే తృణ‌మూల్ కాంగ్రెస్ ను బ‌ల‌ప‌ర్చాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు త‌మ‌పై అపార‌మైన న‌మ్మ‌కంతో ఉన్నార‌ని, తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు సంగ్మా.

Also Read : ఎల్జీ స‌క్సేనాపై భ‌గ్గుమ‌న్న కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!