Sanjay Raut : ద్రోహులు పాల‌కులు కాలేరు – సంజ‌య్ రౌత్

శివ‌సేన ఎంపీ సంచ‌ల‌న కామెంట్స్

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. శివ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీని వ్య‌తిరేకించ‌డం అంటే మ‌రాఠా ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగించిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.

వారు బ‌తికి ఉన్నా లేన‌ట్టేన‌ని ఆరోపించారు. పార్టీ గుర్తించింది. శివ‌సేన ద్వారానే వారికి టికెట్లు వ‌చ్చాయి. ప‌ద‌వులు ద‌క్కాయి.

వ‌స‌తులు స‌మ‌కూరాయి. కానీ ఎవ‌రో ఏదో చెబితే వారి మాట‌లు వింటూ ఇలా త‌మ ఉన్న‌తికి కార‌ణ‌మైన పార్టీని ఎలా కాద‌ని అనుకుంటారంటూ ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్.

వెన్నుపోటుదారులు, ద్రోహులు, మోసకారులు ఎన్న‌టికీ పాల‌కులు కాలేర‌ని జోష్యం చెప్పారు. త‌ల్లిదండ్రుల‌ను మార్చే వారి గురించి మాట్లాడుతున్న గులాబ్ రావ్ పాటిల్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తాను.

నా ఈ ట్వీట్ అస్సాంలోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ లో మ‌కాం వేసిన రెబ‌ల్ ఎమ్మెల్యే ల కోసమ‌ని స్ప‌ష్టం చేశారు. మీరు ఎవ‌రి కోసం అక్క‌డున్నారో మ‌రాఠా ప్ర‌జ‌లు అడుగుతున్నారు.

ముందు వారికి స‌మాధానం చెప్పండి అంటూ నిల‌దీశారు. ప్ర‌జ‌లు మీకు ఓటు వేసి గెలిపించింది మీరు ఏదో సాధిస్తార‌ని అనుకుంటే చివ‌ర‌కు వెన్ను పోటు పొడ‌వ‌డం త‌ప్ప మ‌రో ప‌ని చేయ‌లేద‌న్నారు.

వారికి ద‌మ్ముంటే బ‌య‌ట‌కు రావాల‌ని, మ‌రాఠాలో కాలు పెట్టాలంటూ సంజ‌య్ రౌత్ స‌వాల్ విసిరారు. ఇదిలా ఉండ‌గా ప‌రిస్థితి విష‌మించ‌డంతో కంట్రోల్ చేసేందుకు గాను పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు.

Also Read : ఘ‌నంగా రెబ‌ల్ ఎమ్మెల్యే బ‌ర్త్ డే

Leave A Reply

Your Email Id will not be published!