100 Loan Apps : యూపీ గ్యాంగ్ రూ. 500 కోట్లకు టోకరా
లోన్ యాప్స్ ..కీలకమైన డేటా చోరీ
100 Loan Apps : యూపీకి చెందిన గ్యాంగ్ లోన్ యాప్స్ ఉపయోగించి రూ. 500 కోట్లకు కన్నం వేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వీరి నెట్ వర్క్ ను పోలీసులు చేదించారు. ఏకంగా చైనాకు చెందిన 100 లోన్ యాప్ లను(100 Loan Apps) ఈ గ్యాంగ్ ఉపయోగించడం విశేషం.
మొత్తం వినియోగదారుల డేటాను చైనా కంపెనీలకు చేర వేశారంటూ తెలిపారు. ఈ మొత్తం గ్రూప్ కు దీపక్ కుమార్ సూత్రదారి అని వెల్లడించారు.
చైనా సిటిజన్స్ నిర్వహిస్తున్ రూ. 500 కోట్ల ఇన్ స్టంట్ లోన్ కమ్ ఎక్స్ టార్షన్ రాకెట్ లో ప్రేమయం ఉన్నందుకు దేశ వ్యాప్తంగా 22 మందిని అరెస్ట్ చేశారు.
ఈ రాకెట్ లో 100కి పైగా దరఖాస్తులు ఉన్నాయని , వాటిని యూజర్ కు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు అనుమతించారని తెలిపారు.
ఆ మొత్తం డేటాను చైనా, హాంకాంగ్ లోని సర్వర్ లకు అప్ లోడ్ చేశారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ స్పష్టం చేశారు. రెండు నెలల పాటు సాగిన గ్యాంగ్ ఆపరేషన్ ను విశ్లేషించిన తర్వాత రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.
ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, తదితర రాష్ట్రాల్లో నెట్ వర్క్ విస్తరించిందన్నారు. యూపీలోని లక్నోకు చెందిన కాల్ సెంటర్ లో ఉన్న ముఠా చిన్న
మొత్తాలలో రుణం అందించేందుకు దరఖాస్తులు తీసుకుంది.
యూజర్ అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసి యాప్ కు పర్మిషన్ మంజూరు చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. ఫేక్
ఐడీల ద్వారా సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేస్తారు.
వారి డిమాండ్ ను పట్టించుకోక పోతే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరిస్తారు. డబ్బులు లాక్కుంటారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హాత్రా తెలిపారు.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతర ఓటర్లపై క్లారిటీ