Veerappa Moily : కాంగ్రెస్ శాశ్వ‌తం బీజేపీ అశాశ్వ‌తం

కాంగ్రెస్ అగ్ర నేత వీర‌ప్ప మొయిలీ

Veerappa Moily  : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి వీర‌ప్ప మొయిలీ (Veerappa Moily )సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు.

ప్ర‌స్తుతం మోదీ హ‌వా న‌డుస్తోంద‌ని, ఆయ‌న ఉన్నంత వ‌ర‌కే బీజేపీ ఉంటుంద‌ని ఆ త‌ర్వాత బీజేపీ ఖ‌తం అవుతుందంటూ జోష్యం చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్ర‌పంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. కొంద‌రు అవ‌కాశవాదులు పార్టీలో ఉన్నార‌ని వారి ధ్యాసంతా ప‌ద‌వులపైనేన‌ని ఆరోపించారు. న‌రేంద్ర మోదీ త‌ర్వాత బీజేపీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థం కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

వ్య‌క్తులపై ఆధార‌ప‌డే పార్టీలు ఎప్పుడూ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌వ‌న్నారు. నాటి నెహ్రూ నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించ లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం త‌న గొంతు వినిపిస్తోంద‌న్నారు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప‌గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టిన ఘ‌న‌త మోదీ స‌ర్కార్ ది కాదా అని ప్ర‌శ్నించారు. వెనుక‌బ‌డిన పేద‌లు, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని వారి అభ్యున్న‌తి కోసం వారి త‌ర‌పున మ‌నమంతా పోరాడాల‌ని పిలుపునిచ్చారు వీర‌ప్ప మొయిలీ(Veerappa Moily ).

ఎక్క‌డా ఆశ‌లు కోల్పోకూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం రావాలంటే క‌ష్ట‌ప‌డాల‌ని అంతేకాకుండా నాయ‌కుల మాన‌సిక స్థితి మారాల‌ని స్ప‌ష్టం చేశారు.

ప‌వ‌ర్ లో లేనంత మాత్రాన పార్టీకి చెందిన శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు, బాధ్యులు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు వీర‌ప్ప మొయిలీ. ప్ర‌స్తుతం వీర‌ప్ప మొయిలీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : బీజేపీపై సిసోడియా సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!