Meenakshi Lekhi : జైలు మాన్యువ‌ల్ చ‌ద‌వ‌క పోతే ఎలా – లేఖి

ఆప్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి

Meenakshi Lekhi : కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో జైలులో ఉన్న ఆప్ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కు సంబంధించిన వీడియోలు రోజుకు ఒక‌టి చొప్పున సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో వైర‌ల్ గా మారాయి.

ఆయ‌న త‌న ప‌ర‌ప‌తి, డ‌బ్బును ప్ర‌యోగించి చెర‌సాల‌లో విలాసాలు చేస్తున్నాడంటూ భార‌తీయ జ‌న‌తా ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా స‌త్యేందర్ జైన్ ను వెనకేసుకు రావ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు మీనాక్షి లేఖి(Meenakshi Lekhi) .

మొన్న జైలు గ‌దిలో మంత్రి మ‌సాజ్ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపితే తాజాగా ఖ‌రీదైన ఫుడ్ తో జ‌ల్సా చేస్తున్న వీడియోలు, ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై ఇప్ప‌టికే కోర్టు తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. జైలుకు సంబంధించిన వీడియోలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయంటూ సీరియ‌స్ అయ్యింది.

ఈ త‌రుణంలో ఆప్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. అస‌లు మ‌నీష్ సిసోడియా మ‌తి త‌ప్పి మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు. ఆయ‌న జైలు మాన్యువ‌ల్ గురించి చ‌ద‌వ‌కుండానే కామెంట్స్ చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో మ‌హాన‌గ‌ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. అబ‌ద్దాలు చెబుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ వ‌చ్చిన ఆప్ కు ఈసారి ఎన్నిక‌ల్లో త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు మీనాక్షి లేఖి(Meenakshi Lekhi) .

Also Read : యుఎస్ వాల్ మార్ట్ లో కాల్పుల మోత

Leave A Reply

Your Email Id will not be published!