Wife: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

 

వివాహేతర సంబంధాలు… మనుషులను క్రూర మృగాలుగా తయారుచేస్తున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన వారు కొందరైతే… భార్యపై అనుమానంతో ముక్కలు ముక్కలు కోసి విసిరిపారేసిన భర్తలు కొంతమంది. దీనిలో భాగంగా భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేని భార్య… నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో కర్ణాటకలోని కావేరిపట్టణంలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

 

క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాం తానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47), అతని భార్య కవిత(44) ఉన్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు సూర్య (23) కొడుకు న్నాడు. అయితే రంగస్వామి తాగుడుకు అలవాటు పడడంతో పాటు గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భార్య కవిత… ఈ నెల 9వ తేదీన రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రంగస్వా మిపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాయిన రంగస్వామిని… అతన్ని కొడుకు సూర్య చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకె ళ్లాడు. దీనితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంగ స్వామి మృతి చెందాడు. దీనితో రంగస్వామి మృతి పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!