Avanthi Srinivas : రుజువు చేస్తే రాజీనామా చేస్తా

స‌వాల్ విసిరిన మంత్రి శ్రీ‌నివాస్

Avanthi Srinivas : జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్(Avanthi Srinivas). భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క గ‌జం భూమి తాను ఆక్ర‌మించు కోలేద‌న్నారు. ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌న్నారు.

నువ్వు సినిమాల్లో హీరో అయితే తాను రియ‌ల్ పొలిటిక‌ల్ హీరోన‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రో రాసిచ్చే స్క్రిప్టు చ‌దివే ప‌వ‌న్ కు ఆరోప‌ణ‌లు త‌ప్ప వాస్త‌వాలు తెలియ‌ద‌న్నారు. టీడీపీ గుండాగిరి క‌న‌పడ లేదా అని ప్ర‌శ్నించారు.

టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ చెప్పాల‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ప‌వ‌ర్ స్టార్ కాద‌ని ఆయ‌న ప్యాకేజీ స్టార్ అని మండి ప‌డ్డారు అవంతి శ్రీ‌నివాస్.

భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌యంలో ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. తాము కుల‌, మ‌తాల‌తో సంబంధాలు లేకుండా ల‌క్షా 30 వేల కోట్లు పేద‌ల ఖాతాల్లో జ‌మ చేశామ‌ని చెప్పారు.

ఇవాళ అవంతి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి టూరిస్ట్ గా వ‌చ్చీ పోయే ప‌వ‌న్ కు మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. అమ‌రావ‌తిని తీసి వేస్తామ‌ని ఎప్పుడూ జ‌గ‌న్ చెప్ప‌లేద‌న్నారు.

ఆ విష‌యం తెలుసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. అమ‌రావ‌తితో పాటు ఇత‌ర ప్రాంతాల అభివృద్ధి కూడా చెందాల‌ని కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

జిల్లాల వికేంద్రీక‌ర‌ణ కూడా అభివృద్ధి కోస‌మే ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. నువ్వు ఎన్ని ప్రేలాప‌న‌లు పేలినా నీకు అంత సీన్ లేద‌న్నారు.

Also Read : ప‌వ‌న్‌కు వెల్లంపల్లి స‌వాల్‌

Leave A Reply

Your Email Id will not be published!