Mumbai Local Train : ముంబై లోకల్ ట్రైన్ నుంచి పడి ఐదుగురు మృతి..ఏడుగురికి గాయాలు

డోరు దగ్గర ఉన్న 10 నుంచి 12 మంది ప్రయాణికులు కింద పడిపోయారు...

Mumbai Local Train : నగరంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఓ లోకల్ ట్రైన్ ముంబై ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్’ నుంచి థానేలోని కసరా ఏరియాకు బయలు దేరింది. ప్రయాణికులతో ఆ రైలు కిక్కిరిసిపోయింది. బస్సు డోరు దగ్గర వేలాడినట్లు.. కొంతమంది ప్రయాణికులు రైలు డోరు దగ్గర వేలాడుతూ ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల అధిక రద్దీ కారణంగా తోపులాట జరిగింది.

Mumbai Local Train Accident

డోరు దగ్గర ఉన్న 10 నుంచి 12 మంది ప్రయాణికులు కింద పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదం జరగడానికి గల అసలు కారణం ఏంటో తెలియరాలేదు. తోపులాట కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Also Read : Mukesh Ambani-Jio : మరో సంచలనమైన సర్ప్రైజ్ తో మార్కెట్ ను షేక్ చేయనున్న జియో

Leave A Reply

Your Email Id will not be published!