Jasprit Bumrah : జస్ ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
19 పరుగులు 6 వికెట్లతో రెచ్చి పోయిన బౌలర్
Jasprit Bumrah : భారత ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ లో ఊహించని రీతిలో ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే రీ షెడ్యూల్ 5వ టెస్టు మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్ ఆ తర్వాత టి20 మ్యాచ్ లలో చేతులెత్తేసింది.
ఇదే క్రమంలో ప్రారంభమైన వన్డే సీరీస్ లో ప్రారంభ మ్యాచ్ లోనే సత్తా చాటింది భారత జట్టు. ప్రధానంగా ఇండియన్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు విల విల లాడారు.
ఈ ఒక్క మ్యాచ్ లో ఏకంగా నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఏకంగా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న జస్ ప్రీత్ బుమ్రా కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
మహ్మద్ షమీ 3 వికెట్లు తీస్తే ప్రసిద్ద్ క్రిష్ణ ఒక వికెట్ తో రాణించాడు. ఇక రోహిత్ 7 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. బుమ్రా దెబ్బకు జేసన్ రాయ్ డౌకట్ గా వెనుదిరిగాడు. జో రూట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అనంతరం షమీ ఇన్ స్వింగర్ దెబ్బకు బెన్ స్టోక్స్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో 7 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
బుమ్రా బౌలింగ్ లో ముందుకు వచ్చి షాట్ ఆడ బోయి చిక్కుకున్నాడు లివింగ్ స్టోన్ . సున్నాకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బట్లర్, మోయిన్ అలీ కలిసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. అలీని రిటర్న్ క్యాచ్ తో క్రిష్ణ పెవిలియన్ కు పంపించాడు.
Also Read : చెలరేగిన ఇండియా చేతులెత్తేసిన ఇంగ్లండ్