IND vs PAK Tickets Sold Out : నిమిషాల్లో భార‌త్ పాక్ టికెట్లు క్లోజ్

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్

IND vs PAK Tickets Sold Out : దాయాదుల మ‌ధ్య పోరు అంటేనే ఓ ఉత్కంఠ‌. ఇక భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల(IND vs PAK) మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగినా చూసేందుకు అభిమానులు ముచ్చ‌ట ప‌డ‌తారు.

రికార్డు స్థాయిలో ఇప్ప‌టి కే టికెట్ల‌న్నీ సేల్ కావ‌డం టోర్నీ నిర్వాహ‌కుల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. వ‌చ్చే నెల‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో ఆస్ట్రేలియా వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది.

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇరు జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ లో , ఆఫ్ లైన్ లో టికెట్ల‌న్నీ పూర్తిగా అమ్ముడు పోయాయి.

ఈ విష‌యాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించ‌డం విశేషం. దాయాదుల మ‌ధ్య అక్టోబ‌ర్ 23న కీల‌క పోరు కొన‌సాగ‌నుంది. టికెట్లు అమ్మ‌డు పోయిన విష‌యాన్ని ఐసీసీ స్వ‌యంగా గురువారం వెల్ల‌డించింది.

అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా విక్ర‌యానికి పెట్టిన నిమిషాల్లోపే టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయ‌ని తెలిపింది. వ‌చ్చే నెల‌లో ఆస్ట్రేలియాలో జ‌రిగే మెగా ఈవెంట్ కోసం 5,00,000 టికెట్లు అమ్ముడు పోయాయ‌ని(IND vs PAK Tickets Sold Out) గ్లోబ‌ల్ క్రికెట్ బాడీ వెల్ల‌డించింది.

2020లో మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ఐసీసీ ఈవెంట్ ల‌లో మొద‌టసారిగా పూర్తి స్టేడియాలు తిరిగి నిండాయ‌ని పేర్కొంది.

16 అంత‌ర్జాతీయ జ‌ట్ల నుండి ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌ను చూసేందుకు ప్ర‌పంచంలోని 82 దేశాల‌కు చెందిన అభిమానులు టికెట్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలిపింది ఐసీసీ.

Also Read : టీమిండియా కూర్పుపై శ్రీకాంత్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!