Pawan Kalyan Comment : జ‌న‌సేనాని వ్యూహం ఏంటి ..?

ఏపీ రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర

Pawan Kalyan Comment : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు మారి పోయాయి. నిన్న‌టి దాకా టాప్ లెవ‌ల్లో ఉన్న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన తెలుగుదేశం పార్టీ చీఫ్ ఉన్న‌ట్టుండి ఊహించ‌ని రీతిలో రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. ఆయ‌న‌కు ఇప్ప‌ట్లో బెయిల్ వ‌చ్చేలా లేదు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ చీఫ్, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఆయ‌న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌స్తుతం శ్రీ‌రామ ర‌క్ష‌గా ఉంటాయ‌ని భావిస్తున్నారు. ప్రస్తుతం చాప కింద నీరులా అల్లుకు పోయిన వైసీని ఢీకొనేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌లో తెలుగుదేశం , భార‌తీయ జ‌నతా పార్టీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా యుద్దం చేసేందుకు రెడీ అయ్యాయి.

Pawan Kalyan Comment Viral

సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన తెలుగుదేశం పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఈ త‌రుణంలో బీజేపీ క‌లిసి వ‌స్తుందా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. గ‌తంలో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి ఆ త‌ర్వాత విభేదించి తిరిగి ప‌సుపు ద‌ళంతో జ‌త క‌ట్టారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ ను ఖండించారు. ఆపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . రాబోయే ఎన్నిక‌ల్లో రాక్ష‌స పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు జ‌న‌సేన టీడీపీతో క‌లిసి పోరాడుతుంద‌ని, ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత మౌనంగా ఉన్నారు. త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ కూడా ఎల‌క్ష‌న్స్ కు రెడీ కావాలంటూ పిలుపునిచ్చారు. నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జ‌న సైనికులు టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

ఏపీలో రాజ‌కీయం ప‌సందుగా మారింది. నువ్వా నేనా అన్న‌రీతిలో ముందుకు సాగే ఛాన్స్ ఉండ‌డంతో ఇప్పుడు అంద‌రి ఫోక‌స్ జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ పై నిలిచింది. ఆయ‌న అడుగులు ఎటు వైపు ఉంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఒక‌వేళ తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు, నారా లోకేష్ జైలు పాలైతే టీడీపీకి ఎవ‌రు సార‌థ్యం వ‌హిస్తార‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం ఆలోచిస్తారు. ఎవ‌రెవ‌రితో క‌లిసి వెళ‌తారు..ఏయే పార్టీల‌తో ముందుకు సాగుతార‌నే దానిపై రాజ‌కీయాలు మారే ఛాన్స్ ఉంది. మ‌రో వైపు బీజేపీ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వహ‌రిస్తోంది. వైసీపీతో స్నేహం చేస్తూనే మ‌రో వైపు పావులు క‌దుపుతోంది. జ‌న‌సేన టీడీపీతో క‌లిసి సాగుతామ‌ని ప్ర‌క‌టిస్తే బీజేపీ టీడీపీతో ఇంకా చెప్ప‌లేమంటోంది ఆ పార్టీ చీఫ్ పురందేశ్వ‌రి. బీజేపీ రాక పోయినా చంద్ర‌బాబుతో పొత్తు త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాబోయే రోజుల్లో జ‌న‌సేనాని ఏం చేయ‌బోతున్నార‌నేది సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

Also Read : Nara Lokesh : పారిపోలేదు ఇక్క‌డే ఉన్నా

Leave A Reply

Your Email Id will not be published!