Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

కాగా, తిరుమలలో చంద్రబాబుకు పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు.

Chandrababu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం మీదుగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి లఘు దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వెళుతూ క్యూలో నిల్చున్న భక్తుల వద్దకు చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేశారు. తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చంద్రబాబు ప్రయాణించారు.

Chandrababu Visited

కాగా, తిరుమలలో చంద్రబాబుకు పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. గతంలోలా కాకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అతిథి గృహం వద్ద పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు దర్శనానికి రాగానే సెక్యూరిటీ గార్డులు భక్తులను క్యూ కాంప్లెక్స్, ఆలయం వద్దకు అనుమతించలేదు. చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న సమయంలో కూడా క్యూ కట్టి స్వామివారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. ఎన్డీయే పొత్తు నేపథ్యంలో పోలీసులు, టీటీడీ అధికారుల్లో మార్పు వచ్చిందని మద్దతుదారులు వాదిస్తున్నారు.

Also Read : Afghanistan Floods : 200 కు పైగా మృతిచెందారంటున్న ఐక్యరాజ్యసమితి

Leave A Reply

Your Email Id will not be published!