MLA Amarnath Reddy : మాజీ మంత్రి బొత్స ట్వీట్ కు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

బందర్ పోర్టులో వాటాలు ఇవ్వడం మరిచిపోలేదన్నారు...

MLA Amarnath Reddy : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ట్వీట్‌ను టీడీపీ ఎంపీ అమర్‌నాథ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల పారదర్శకత, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మంచిదని బొత్స ట్వీట్ చేశారు. దీనికి అమర్‌నాథ్ బదులిస్తూ.. బొత్స.. ఆవేశపడకండి.. జగన్ కాదు చంద్రబాబు. జగన్ వచ్చాక చర్చలు లేకుండానే ఏపీ భవనాన్ని అప్పగించిన సంగతి మరిచిపోలేదన్నారు.

MLA Amarnath Reddy Comment

బందర్ పోర్టులో వాటాలు ఇవ్వడం మరిచిపోలేదన్నారు. తాళం పగులగొట్టి ఏపీ ఆయుష్ భవనాన్ని ఆక్రమించినప్పుడు మౌనం వహించిన సంగతి మరిచిపోలేదన్నారు. పోలవరం నీటిని అందజేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని మరిచిపోలేదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని జగన్‌కు కేసీఆర్ సూచించిన విషయం మరిచిపోలేదన్నారు. కేసీఆర్ కాళ్లపై విజయసాయిరెడ్డి పడిన సంగతి మరిచిపోరని విమర్శించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి సీనియర్ నాయకుడిగా కృషి చేస్తానన్నారు. మీలాగా ఆస్తులు, కేసులు డిఫెండ్ చేసే పని ఆయనకు లేదన్నారు అమర్‌నాథ్‌రెడ్డి.

Also Read : Minister Seethakka : రక్షిత మంచినీటి పథకంలో కీలక అంశాలను వెల్లడించిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!