Southern Railway : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుమతి

నెం.22624/22623 మదురై-తాంబరం-మదురై సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు..

Southern Railway : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు హాల్ట్‌ కల్పించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.12522 ఎన్నాకుళం-బరౌని రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7వ తేది నుంచి చీరాల స్టేషన్‌లో ఆగనుంది. నెం.16004 నాగర్‌సోల్‌-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌లోను, నెం.22101 లోకమాన్య తిలక్‌ టెర్మిన్‌స-మదురై ఎక్స్‌ప్రెస్‌ గుత్తిలో, నెం. 11017 లోకమాన్య తిలక్‌-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌ గుత్తి, తాడిపత్రి, నెం.22669 ఎర్నాకుళం-పాట్నా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మం, నెం.12656 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌ నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగనున్నాయి.

Southern Railway Updates

అలాగే,నెం.12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌, నెం.12611 సెంట్రల్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ గరీభ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరంగల్‌, నెం.12603 చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నెం.17643 చెంగల్పట్లు-కాకినాడ పోర్ట్‌ సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళగిరి, న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆగుతాయని దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. నెం.22624/22623 మదురై-తాంబరం-మదురై సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు ఈ నెల 6 నుంచి 20వ తేది వరకు అదనంగా రెండు ఏసీ త్రీ టైర్‌, రెండు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : PM Narendra Modi : మహా కుంభమేళా త్రివేణి సంఘం ఘాట్ కు ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!