MP Shashi Tharoor : కొలంబియా దేశంలో ఆ దేశ నిర్వాకాన్ని ఎత్తిచూపిన శశీ థరూర్
Shashi Tharoor : కొలంబియా దేశపు తీరు తమను తీవ్ర నిరాశకు, ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ వ్యాఖ్యానించారు. కొలంబియా గడ్డపై అడుగుపెట్టి ఆ దేశం చేసిన నిర్వాకాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు శశిథరూర్(Shashi Tharoor). ఆపరేషన్ సింధూర్ అనంతరం వివిధ దేశాల్లో పర్యటిస్తూ భారత వైఖరిని చాటిచెబుతున్నశశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిన్న (మే 29)న కొలంబియాకు చేరుకుంది.
Shashi Tharoor Shocking Comments
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్.. పాకిస్థాన్, పీవోకే లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన క్షిపణి దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్లో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కొలంబియా ప్రభుత్వం తన స్పందన తెలియజేసింది. అయితే, కొలంబియా ప్రభుత్వ స్పందన తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని శశిథరూర్ ఆ దేశానికే తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడానికి బదులుగా కొలంబియా ప్రభుత్వం ఉగ్రమూకల మృతికి సంతాపం, సానుభూతి తెలపడం వింతగా ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సింధూర్లో(Operation Sindoor) భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్లో జరిగిన ప్రాణనష్టంపై కొలంబియా హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేయడం విడ్డూరంగా అనిపించిందని శశిథరూర్ ఆ దేశం ముందే కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్లకి, వాటిని ప్రతిఘటించే వాళ్లకి ఎప్పుడూ సమానత్వం ఉండదని, ఉండకూడదని శశిథరూర్ అన్నారు. కొలంబియా మాదిరే భారత్ కూడా అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ దుర్మార్గాల్ని భరిస్తూ వస్తున్నామని శశిథరూర్ అన్నారు. అసలు బొగోటా వైఖరేంటనే రీతిలో శశిథరూర్ ప్రసంగం సాగింది.
Also Read : Maoist Encounter : ఆపరేషన్ కగార్ లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి శుభవార్త