Ahmed Basha: వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు బెయిల్
వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు బెయిల్
Ahmed Basha : వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా బెయిల్ పై విడుదలయ్యారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కడప కోర్టు కొట్టివేసింది. అంతేకాదు మరో కేసులో పోలీసులు వేసిన పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీనితో కడప జైలు నుండి అహ్మద్ బాష విడుదలయ్యారు.
Ahmed Basha Got Bail
గతంలో ఓ వివాదంలో కడప తాలూకా స్టేషన్ లో అహ్మద్ భాషపై(Ahmed Basha) కేసు నమోదైంది. ఆ సమయంలోనే అహ్మద్ బాషా రాజీ పడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధితుడు మళ్ళీ ఫిర్యాదు చేయడంతో అహ్మద్ బాషాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు… లుకౌట్ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు రంజాన్ పండుగ అనంతర కువైట్ వెళ్లడానికి ముంబై చేరుకున్న అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే,కేసుపై బుధవారం విచారణ చేపట్టిన కడప కోర్టు అహ్మద్ బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో కడప సెంట్రల్ జైలు నుంచి అహ్మద్ భాషా విడుదలయ్యారు. సెంట్రల్ జైలు వద్ద అహ్మద్ భాషాకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష,పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికారు.
2022లో కడప వినాయకనగర్ లో తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా… ఆయనపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో ఇటీవల కడపకు వచ్చారు. శనివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకోగా… అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Amaravati: అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కేంద్రం పచ్చజెండా