Ajit Doval : ‘ఆపరేషన్ సింధూర్’ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన అజిత్ డోభాల్
ఒక్క లక్ష్యాన్ని కూడా మిస్ కాలేదు...
Ajit Doval : పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ పై వస్తున్న విమర్శలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) ఖండించారు. ఈ ఆపరేషన్ వల్ల భారత్కి నష్టం జరిగిందని చెబుతున్నవారు తమ వాదనను సమర్థించే ఏదైనా ఆధారాన్ని చూపాలని ఆయన సవాలు చేశారు.
Ajit Doval Comments
ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డోభాల్, ఈ సందర్భంగా మాట్లాడారు. “భారత సైన్యం అత్యంత ఖచ్చితమైన సమాచారంతో పాకిస్థాన్ లోపల 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ఒక్క లక్ష్యాన్ని కూడా మిస్ కాలేదు. కేవలం 32 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది,” అని తెలిపారు.
పాజిటివ్ ఫలితాలపై స్పష్టత:
ఆపరేషన్ ఫలితాలను ప్రశ్నించేవారు, భారత్కు నష్టం జరిగిందని చెప్పే కనీసం ఒక్క ఫోటోనైనా చూపించగలరా? అని డోభాల్ ప్రశ్నించారు. అంతర్జాతీయంగా కొంత నెగటివ్ కవరేజ్ వచ్చినా, శాటిలైట్ చిత్రాలు మాత్రం వాస్తవాలను వెల్లడించాయని చెప్పారు. మే 10వ తేదీకి ముందు, తరువాత పాకిస్థాన్లోని 13 ఎయిర్ బేస్లకు ఏమాత్రం హాని జరగలేదని స్పష్టం చేశారు.
దేశీయ సాంకేతికతతో రక్షణ విజయం:
ఈ ఆపరేషన్లో పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని, ఇది భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వైపు తీసుకున్న మెుదటి గొప్ప అడుగులలో ఒకటిగా నిలిచిందని డోభాల్ పేర్కొన్నారు. “ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇంటెలిజెన్స్ సామర్థ్యం, సైనిక వ్యూహాత్మకత ప్రపంచానికి గుర్తింపు పొందింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన స్పష్టంగా చెప్పిన దాని ప్రకారం, దేశ భద్రతపై ఎవరు సందేహాలు వ్యక్తం చేసినా, భారత్ సామర్థ్యాన్ని చిన్నచూపు చూడడం తగదు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న రక్షణ వ్యవస్థలు భవిష్యత్లో భారత్ను మరింత బలంగా నిలబెట్టనున్నాయని తెలిపారు.
Also Read : Home Minister Anitha : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పై భగ్గుమన్న హోంమంత్రి
